అన్న ఆదుకుంటాడు-తమ్ముడు వాడుకుంటాడు : లారెన్స్‌పై జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదు

కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ అతని తమ్ముడు ఎల్విన్‌పై కేసు పెట్టిన జూనియర్ ఆర్టిస్ట్ దివ్య..

  • Published By: sekhar ,Published On : March 10, 2020 / 10:17 AM IST
అన్న ఆదుకుంటాడు-తమ్ముడు వాడుకుంటాడు : లారెన్స్‌పై జూనియర్ ఆర్టిస్ట్ ఫిర్యాదు

కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ అతని తమ్ముడు ఎల్విన్‌పై కేసు పెట్టిన జూనియర్ ఆర్టిస్ట్ దివ్య..

చెడ్డోడిగా గుర్తింపు పొందడం చాలా తేలిక కానీ నలుగురితో మంచి అనిపించుకోవడం మాత్రం చాలా కష్టం.. ఒక్కోసారి చేసిన తప్పు దిద్దుకోవడానికి జీవితకాలం కూడా సరిపోదు అని పెద్దవాళ్లు ఊరికే చెప్పలేదు. రాఘవ లారెన్స్.. తమిళ చిత్ర పరిశ్రమలో గ్రూపు డ్యాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాల విషయం పక్కన పెడితే గతకొన్నేళ్లుగా విరివిగా సేవా కార్యక్రమాలు చేస్తూ, పేదల పాలిట పెన్నిధిగా నిలిచాడు. అటువంటి లారెన్స్ ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్నాడు. అదికూడా తన తోడబుట్టిన తమ్ముడి వల్ల.. లారెన్స్‌కు తమ్ముడంటే చాలా ఇష్టం..

అసలేం జరిగిందంటే.. ప్రేమ పేరుతో లారెన్స్‌ తమ్ముడు ఎల్విన్‌ అలియాస్‌ వినోద్‌ తనతో పాటు చాలా మంది అమ్మాయిలను మోసం చేస్తూ శారీరకంగా వాడుకుంటున్నారని.. ఆయనను లారెన్స్‌ సహకరిస్తున్నారని దివ్య అనే జూనియర్ ఆర్టిస్ట్ ఎస్టీ, ఎస్టీ కమీషన్ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసింది. సహాయం కోసం వెళ్తే అప్పటి వెస్ట్‌ మారేడ్‌పల్లి సీఐ.. ప్రస్తుత ఏసీపీ రవీందర్‌రెడ్డి తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొంది. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రేమను తిరస్కరించింనందుకు వినోద్‌ గత కొంతకాలంగా తనను వేధిస్తున్నాడని ఆరోపించారు. తన ఫోన్‌ నెంబర్‌ తీసుకొని వినోద్‌ ప్రపోజ్‌ చేశాడని.. తిరస్కరించడంతో చంపుతానని బెదిరిస్తున్నాడని, తన స్నేహితులను సైతం ట్రాప్‌ చేసి వారితో వినోద్‌ అసభ్యకరంగా ప్రవర్తించాడని దివ్య ఆరోపించింది.

‘వినోద్ వేధింపులను తట్టుకోలేక మొదటగా ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాను. అయితే అక్కడ ఎఫ్‌ఐఆర్‌ బుక్‌ చేయకుండా  ఓ కానిస్టేబుల్‌తో మళ్లీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టనని వినోద్‌ చెప్పించాడు. దీంతో కేసు పెట్టకుండా వెళ్లిపోయాను. మళ్లీ కొద్దిరోజుల తర్వాత తిరిగి వేధించడం మొదలు పెట్టాడు. ఆయన వేధింపులు భరించలేక వెస్ట్‌ మారెడ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాను. అప్పటి వెస్ట్‌ మారెడ్‌పల్లి సీఐ రవీందర్‌రెడ్డి తాను చెప్పినట్లు వింటే న్యాయం చేస్తానని అన్నారు.

కేసు గురించి మాట్లాడేందుకు ఓ లాడ్జికి రమ్మని అక్కడ నాతో అసభ్యంగా మాట్లాడారు. కులం పేరుతో దూషించారు. నాపై తప్పుడు కేసు (బ్రోతల్) నమోదు చేశారు. 2006 నుంచి తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అని దివ్య వాపోయింది. తనకు న్యాయం చేయాలని  ఎన్టీ కమిషన్‌ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఆమె విజ్ఙప్తి చేసింది. భాదితురాలికి అండగా ఉంటామని, ఎల్విన్, రవీందర్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని ఎర్రోళ్ల తెలిపారు.

See Also | బేర్‌తో కలిసి డేర్‌గా.. రజనీ స్టైల్ అదుర్సు కదూ!..