చరణ్తో దివాళీ.. మంచు లక్ష్మీ భాయ్ దూజ్!
Ram Charan – Manchu Manoj: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, రాకింగ్ స్టార్ మంచు మనోజ్, లక్ష్మీ మంచు కలిసి ఈ దీపావళిని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. స్వీట్ బ్రదర్ చరణ్, లవ్లీ అక్క లక్ష్మీలతో దివాళీ పండుగ జరపుకోవడం ఆనందంగా ఉంది అంటూ ఇందుకు సంబంధించిన ఫొటోను మనోజ్ తాజాగా షేర్ చేశాడు.
View this post on Instagram
భాయ్ దూజ్ శుభాకాంక్షలు
దీపావళి అనంతరం వచ్చే పాడ్యమి రోజు నుంచి కార్తీక మాసం మొదలవుతుందనే విషయం తెలిసిందే. కార్తీకమాసం ప్రారంభమవ్వడమే కాకుండా.. ఈ రోజుకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే.. సోదరులకు సోదరీమణులు స్వయంగా తయారు చేసిన భోజనాన్ని తినిపించాలి. దీనినే తెలుగులో భగినీహస్త భోజనం అంటారు.
భగినీ అంటే అక్కా లేదా చెల్లి అని అర్థం. దీనికి సంబంధించి పురాణాల్లో ఓ కథ కూడా ఉందనేది నానుడి. ఈ భగినీహస్త భోజనం వేడుకను మంచు లక్ష్మీ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. ఈ సెలబ్రేషన్కు సంబంధించిన ఫొటోలతో ఆమె తన ఇన్స్టాగ్రమ్ ద్వారా ఓ వీడియోని షేర్ చేసింది.ఈ ఫొటోలు చూస్తుంటే తన ఇద్దరు సోదరులతో మంచు లక్ష్మీ చాలా సరదాగా గడిపినట్లు తెలుస్తోంది. చిన్న పిల్లలా పెద్ద తమ్ముడు విష్ణుపైకి ఎక్కేసింది. ఇక ఈ వీడియో షేర్ చేసిన మంచు లక్ష్మీ.. భాయ్ దూజ్ శుభాకాంక్షలు తెలుపుతూ.. మంచు విష్ణు, మంచు మనోజ్లే తనకు బలమని చెప్పుకొచ్చింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
https://10tv.in/rrr-team-amidst-cold-weather/
View this post on Instagram