మన్మథుడు-2 : వైరల్ అవుతున్న నాగ్ పిక్

సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్ననాగ్ పిక్స్..

  • Published By: sekhar ,Published On : April 18, 2019 / 12:42 PM IST
మన్మథుడు-2 : వైరల్ అవుతున్న నాగ్ పిక్

సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్ననాగ్ పిక్స్..

కింగ్ నాగార్జున, రకుల్ ప్రీత్ జంటగా, యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో, మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న సినిమా.. మన్మథుడు-2.. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పోర్చుగల్‌లో స్టార్ట్ అయ్యింది. హిందీ మూవీ, దే దే ప్యార్ దే సినిమా కోసం బరువు తగ్గిన రకుల్, ఈ సినిమా కోసం బరువు పెరాగాల్సి ఉంది. ఆమె విషయంలో నాగ్ అసంతృప్తిగా ఉన్నాడు అనే రూమర్స్ రావడంతో, రాహుల్ వాటిని కొట్టిపారేస్తూ, రకుల్ షూట్‌లో పాల్గొంటుందని, ఆమె సినిమాలో ఉండడం మా అదృష్టం అని క్లారిటీ ఇచ్చాడు. పనిలో పనిగా నాగ్ సీరియస్‌గా వర్కౌట్ చేస్తున్న పిక్స్ షేర్ చేసాడు.

కింగ్ ఫ్యాన్స్.. ఈ ఒక్క సీన్ మాత్రమే మీకోసం.. అంటూ రాహుల్, నాగ్ పిక్స్ పోస్ట్ చెయ్యడంతో అక్కినేని అభిమానులు చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇప్పుడీ పిక్స్ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.. మన్మథుడు-2లో నాగ్ కోడలు సమంత గెస్ట్ రోల్ చెయ్యనుంది.. వెన్నెల కిషోర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు. డిసెంబర్‌లో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.