ప్రభాస్ 21 అప్‌డేట్ వచ్చేసింది..

ప్రభాస్ 21 అప్‌డేట్ వచ్చేసింది..

Prabhas 21: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సంస్థ పాన్ ఇండియా స్థాయిలో ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే కథానాయిక. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు.

సినిమా ప్రకటించి చాలా కాలం అవుతున్నా ఎలాంటి అప్‌డేట్ ఇవ్వడం లేదేంటని డార్లింగ్ ఫ్యాన్స్ నాగ్ అశ్విన్‌ను అడగ్గా.. ‘జనవరి 29, ఫిబ్రవరి 26న రెండు అప్‌డేట్స్ వస్తాయి’ అని చెప్పారు. అన్నట్లుగానే జనవరి 29 న అప్‌డేట్ ఇచ్చారు.

Prabhas 21

ఈ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా సినిమాకు పనిచేయబోయే సంగీత దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ వివరాలను సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది నిర్మాణ సంస్థ. ‘మహానటి’ చిత్రానికి పని చేసిన స్పానిష్ టెక్నీషియన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ చిత్రానికి కూడా సినిమాటోగ్రాఫర్‌గా పని చేయనున్నారు. అలాగే తన సంగీతంతో ప్రేక్షకులను అలరించే మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చనున్నారు.

Prabhas 21