Prabhas : సింగీతంతో ప్రభాస్.. వైరల్ అవుతున్న ఫోటో..

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా హీరో ప్రాజెక్ట్-K షూటింగ్ లో ఉన్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ప్రత్యేక సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్‌లో..

Prabhas : సింగీతంతో ప్రభాస్.. వైరల్ అవుతున్న ఫోటో..

Prabhas photo with Singeetam Srinivasa Rao gone viral

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ వరుస షూటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఒక సినిమా షెడ్యూల్ తరువాత మరొక సినిమా షెడ్యూల్ లో పాల్గొంటూ ఎప్పుడు ఏ సినిమా సెట్ లో ఉంటున్నాడో కూడా తెలియడం లేదు. ప్రస్తుతం ఈ పాన్ ఇండియా హీరో ప్రాజెక్ట్-K షూటింగ్ లో ఉన్నాడు. మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ప్రపంచంలోని టాప్ సినీ టెక్నిషన్స్ ని రంగంలోకి దించుతున్నారట.

Prabhas : అన్‌స్టాపబుల్ సెట్‌లో ‘ప్రభాస్’పై స్పెషల్ AV షూటింగ్.. ఫ్యాన్స్ హంగామా!

కాగా ఈ చిత్రం టైమ్ ట్రావెల్ నేపథ్యంతో రాబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ప్రత్యేక సెట్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ షూటింగ్ లో ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ‘సింగీతం శ్రీనివాస’ దర్శనమిచ్చాడు. సింగీతంతో కలిసి ప్రభాస్ దిగిన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అయితే గతంలో సింగీతం శ్రీనివాస దర్శకత్వంలో ‘ఆదిత్య 369’ వంటి టైమ్ ట్రావెల్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఈ డైరెక్టర్ ఇప్పుడు ఈ సెట్ లో కనిపించడం చర్చకు దారి తీస్తుంది.

సినిమా స్క్రిప్ట్ విషయంలో నాగ అశ్విన్, సింగీతం సాయం తీసుకుంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. అది అలా ఉంటే ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తున్నాడు. దీపికా పడుకోణె ప్రభాస్ కి జంటగా నటిస్తుంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్విని దత్ నిర్మిస్తున్నాడు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు.