NV Prasad : ప్రజారాజ్యంలోంచి పుట్టిన బాధ, ఆవేశమే జనసేన.. చిరంజీవి ఆస్తులు అమ్మి పార్టీ అప్పులు తీర్చారు..

NV ప్రసాద్ మాట్లాడుతూ.. ''ఇటీవల చిరంజీవి గారి గురించి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఎలా పడితే అలా రాస్తున్నారు. ఆయన గురించి చాలా మందికి ఏమి తెలీవు. మేము ఎప్పట్నుంచో ఆయనతో ట్రావెల్ అవుతున్నాం. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయనతో...............

NV Prasad : ప్రజారాజ్యంలోంచి పుట్టిన బాధ, ఆవేశమే జనసేన.. చిరంజీవి ఆస్తులు అమ్మి పార్టీ అప్పులు తీర్చారు..

Producer NV Prasad fires on Media about chiranjeevi

NV Prasad :  చిరంజీవి హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సినిమా చూసిన ప్రేక్షకులంతా బాస్ ఈజ్ బ్యాక్ అంటున్నారు. చాలా రోజుల తర్వాత భారీ విజయం సాధించడంతో అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి ఈ సినిమాకి. తాజాగా గాడ్ ఫాదర్ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో అందరూ చిరంజీవిని పొగిడేశారు.

ఈ ఈవెంట్లో నిర్మాత NV ప్రసాద్ చాలా ఆవేశంగా, ఎమోషనల్ గా మాట్లాడారు. చిరంజీవి గురించి వ్యతిరేకంగా రాసేవాళ్ళ గురించి మాట్లాడుతూ ఫైర్ అయ్యారు. NV ప్రసాద్ మాట్లాడుతూ.. ”ఇటీవల చిరంజీవి గారి గురించి ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఎలా పడితే అలా రాస్తున్నారు. ఆయన గురించి చాలా మందికి ఏమి తెలీవు. మేము ఎప్పట్నుంచో ఆయనతో ట్రావెల్ అవుతున్నాం. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయనతో కార్యకర్తల్లాగా ట్రావెల్ అయ్యాము. అప్పుడు పార్టీ వాళ్ళతో నిజాయితితో మాట్లాడిన మాటలు నాకు ఇప్పటికి గుర్తు ఉన్నాయి.”

”చాలా మంది ప్రజారాజ్యం పార్టీ గురించి వస్తే చిరంజీవిని అమ్ముడుపోయారు అంటారు. ఆయన్ని ఎన్ని మాటలు అన్నా ఆయన చిరునవ్వుతోనే అందర్నీ గౌరవించారు. ఆయన మంచి వ్యక్తి కాబట్టి సైలెంట్ గా ఉన్నారు. కానీ ఆయన గురించి మాట్లాడితే మేము ఊరుకోము. ఆయన అమ్ముడుపోయారు అంటారు, అసలు మీ ఎవరికీ తెలియని విషయం నేను చెప్తాను. మద్రాస్‌లో ప్రసాద్‌ ల్యాబ్‌ పక్కన ఉండే ఖరీదైన ఆస్తి కృష్ణా గార్డెన్ చిరంజీవి గారిది. అలాంటి ఆస్తిని ఎవరూ వదులుకోరు, కానీ ఆయన ప్రజారాజ్యం పార్టీ మూసేసినప్పుడు ఆ ఆస్తి అమ్మేసి పార్టీ అప్పులు తీర్చారు. దానికోసం పనిచేసిన వాళ్లకి ఇచ్చేశారు. అది ఆయన వ్యక్తిత్వం. ఈ ఏజ్ లో ఇవాళ్టికి కూడా రోజూ ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి పని చేసే అలాంటి వ్యక్తి గురించి ఎవరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడుతున్నారు”

Chota K Naidu : చిరంజీవి విషయంలో గరికపాటికి కౌంటర్ ఇచ్చిన చోటా కె నాయుడు

”చిరంజీవి గారంటే స్టార్, స్పెషల్ పర్సన్ కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. ఆ రోజు ప్రజారాజ్యం అలా అయినందుకు ఆ బాధ, ఆవేశంలోంచి పుట్టిందే ఇవాళ్టి జనసేన. చిరంజీవి గారు మీరెంత సహనంగా ఉన్నా, గౌరవంగా ఉన్నా కొన్ని విషయాల్లో మాత్రం సీరియస్ అవ్వకపోతే తప్పదు సర్. మీరు అవ్వకపోయినా మిమ్మల్ని ఏమన్నా అంటే మేము ఊరుకోము. సోషల్‌ మీడియాలో కానీ, మీడియా వ్యక్తులు కానీ ఒక వ్యక్తి గురించి మాట్లాడుకునేప్పుడు ఒకసారి ఆలోచించండి వాళ్ళు ఎలాంటి వాళ్ళో’’ అని ఆవేశంగా మాట్లాడారు. దీంతో NV ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.