NCB ఎదుట హాజరు కావడానికి ముంబై బయలుదేరిన రకుల్..

  • Published By: sekhar ,Published On : September 24, 2020 / 09:29 PM IST
NCB ఎదుట హాజరు కావడానికి ముంబై బయలుదేరిన రకుల్..

Bollywood Drugs Case – Rakul Preet: రేపు(శుక్రవారం) ఎన్‌సీబీ విచారణకు హాజరుకావడానికి నటి రకుల్ ప్రీత్ సిద్ధమైంది. NCB ముందు హాజరవడానికి కొద్దిసేపటి క్రితం హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి ముంబై బయలుదేరింది.

కాగా నేడు శృతి మోడీ, ఖంబట్టా సైమోన్ విచారణకు హాజరయ్యారు. రకుల్ తో పాటు దీపిక మేనేజర్ కరిష్మాను కూడా విచారించనున్నారని తెలుస్తోంది.
గోవా నుండి ముంబై చేరుకున్న దీపికా పదుకొణే శనివారం (సెప్టెంబర్ 26)న విచారణకు హాజరుకానుంది.

ఎన్‌సీబీ విచారణ కోసం దీపిక పూర్తిగా సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే న్యాయ నిపుణులను సంప్రదించిన దీపిక సుమారు 12 మంది లాయర్లతో ఎలాంటి న్యాయ పరమైన చర్యలు ఎదుర్కోవడానికైనా సిద్ధమైనట్లు సమాచారం.