Ram Gopal Varma: వంగవీటి సినీ నిర్మాతతో RGV కొత్త సినిమా.. రెండు భాగాలుగా రాబోతున్నట్లు ప్రకటన!

సినిమా ప్రకటనతోనే సంచలనం సృష్టించే దర్శకుడు రాంగోపాల్ వర్మ.. తన తదుపరి సినిమాని అనౌన్స్ చేశాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతున్నట్లు వెల్లడించాడు. అలాగే ఈ చిత్రం పూర్తీ రాజకీయ ఆరాచక అంశాలపై తెరకెక్కించబోతున్నట్లు తన సోషల్ మీడియా వేదికలో పేర్కొన్నాడు. ఈ బుధవారం వర్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవడంతో ఈ సినిమాపై ఎన్నో అనుమానాస్పద చర్చలకు దారితీస్తుంది.

Ram Gopal Varma: వంగవీటి సినీ నిర్మాతతో RGV కొత్త సినిమా.. రెండు భాగాలుగా రాబోతున్నట్లు ప్రకటన!

Ram Gopal Varma: సినిమా ప్రకటనతోనే సంచలనం సృష్టించే దర్శకుడు రాంగోపాల్ వర్మ.. తన తదుపరి సినిమాని అనౌన్స్ చేశాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతున్నట్లు వెల్లడించాడు. అలాగే ఈ చిత్రం పూర్తీ రాజకీయ ఆరాచక అంశాలపై తెరకెక్కించబోతున్నట్లు తన సోషల్ మీడియా వేదికలో పేర్కొన్నాడు. ఈ బుధవారం వర్మ ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవడంతో ఈ సినిమాపై ఎన్నో అనుమానాస్పద చర్చలకు దారితీస్తుంది.

RamGopal Varma: RGV కొత్త సినిమా “వ్యూహం”.. పవన్ కళ్యాణ్ బయోపిక్?

ఈ చిత్రం 2 పార్ట్స్ గా రాబోతుండగా.. మొదటి భాగానికి “వ్యూహం”, రెండో భాగానికి “శపథం” అనే టైటిల్స్ ని పెట్టాడు. అహంకారానికి , ఆశయానికి మధ్య జరిగిన పోరాటం నుండి ఉద్భవించిన కథే “వ్యూహం”. రాష్ట్ర ప్రజలు మొదటి చిత్రం “వ్యూహం “ షాక్ నుంచి తెరుకునేలోపే వాళ్ళకి ఇంకో ఎలెక్ట్రిక్ షాక్ , పార్ట్ 2 “శపథం“తో తగులుతుంది. 2024 ఎలక్షన్స్ టార్గెట్ గా ఈ చిత్రం తియ్యట్లేదని చెప్తే ఎవ్వరూ నమ్మరు, కాబట్టి నేను ఏమి చెప్పట్లేదు అంటూ వెల్లడించాడు.

ఈ చిత్రానికి గతంలో తనతో వంగవీటి సినిమా తర్కెక్కించిన దాసరి కిరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. కాగా ఈ సినిమా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ సినిమా తీయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల ముందు కూడా వర్మ చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ “లక్ష్మీస్ ఎన్టీఆర్” తీశాడు. ఆ సమయంలో అది వైసీపీకి కొంతవరకు కలిసి వచ్చింది. ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానుల, మూడు పెళ్లిళ్లు రచ్చ నడుస్తుండడంతో.. ఈ సినిమా ప్రకటన రాజకీయపరంగా హిట్ పెంచేస్తుంది.