Rana Daggubati : ‘ఎవడు బ్రో నీకు చెప్పింది.. నీ సోది’.. రానా ట్వీట్ వైరల్..
‘విరాట పర్వం’ సినిమా గురించి ఫేక్ న్యూస్.. లింక్ షేర్ చేసిన రానా..
Rana Daggubati: రానా దగ్గుబాటి, బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా, వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘విరాటపర్వం’ (రివల్యూషన్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ లవ్).. ఈ సినిమా నుండి ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోలు ఆకట్టుకోవడంతో పాటు అంచనాలు పెంచాయి.
Jr Soundarya : సౌందర్య మళ్లీ పుట్టిందా?జూనియర్ సౌందర్యను చూశారా!
రీసెంట్గా ‘విరాట పర్వం’ సినిమా నుండి మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి తప్పుకున్నాడంటూ ఒక వెబ్సైట్ ఆర్టకల్ పబ్లిష్ చేసింది. ఆ ఆర్టికల్ లింక్ షేర్ చేస్తూ.. ‘ఎవడు బ్రో నీకు చెప్పింది.. నీ సోది’ అంటూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Pragathi : క్యాట్వాక్తో కవ్విస్తున్న ప్రగతి
సురేష్ ప్రొడక్షన్స్ డి.సురేష్ బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి.సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. ముందుగా ఈఏడాది ఏప్రిల్ 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా వేశారు. త్వరలో కొత్త డేట్ అనౌన్స్ చెయ్యనున్నారు.
Yavadu bro neeku chepindhi ?? nee sodhi… https://t.co/ofG6xYGZt5
— Rana Daggubati (@RanaDaggubati) November 2, 2021