Pushpa: పుష్పరాజ్ కోసం చీఫ్ గెస్ట్గా రెబల్ స్టార్..?
కరోనా తర్వాత సినిమా కష్టాల నుండి బయటపడేందుకు స్టార్ హీరోలందరూ ఉమ్మడిగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నడూ లేనిది మెగా, నందమూరి హీరోలు సైతం ఒకరికి ఒకరు సహకరించుకుంటూ..
Pushpa: కరోనా తర్వాత సినిమా కష్టాల నుండి బయటపడేందుకు స్టార్ హీరోలందరూ ఉమ్మడిగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నడూ లేనిది మెగా, నందమూరి హీరోలు సైతం ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ఒకరి సినిమాలకు ఒకరు ప్రమోషన్ చేసి పెడుతున్నారు. బాలకృష్ణ అఖండ ప్రీ రిలీజ్ వేడుకకు అల్లు అర్జున్, రాజమౌళి అతిధులుగా విచ్చేసి సినీ పరిశ్రమను కాపాడుకుంటామని ధీమాగా చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా పుష్ప వంతు వచ్చింది.
Telugu Star Hero’s: ఒక్క హిట్టు.. ఇప్పుడు ఆశలన్నీ ఒక్క హిట్టుపైనే
అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ సినిమా డిసెంబర్ 17వ తేదిన భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ప్రమోషన్స్ని జోరుగా చేస్తున్న యూనిట్ డిసెంబర్ 12న ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహించనున్నట్లుగా తెలుస్తుంది. దీంతో ఈ వేడుకకు అతిధులుగా ఎవరు రానున్నారన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది.
Acharya: ఎక్స్పెక్టేషన్స్ని విపరీతంగా పెంచేసిన చరణ్ టీజర్!
హైదరాబాద్లో భారీ స్థాయిలో జరగనున్న ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్కి పుష్ప మేకర్స్ ప్రభాస్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారని ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అలాంటి స్టార్ ఈవెంట్ కి వస్తే అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా సినిమా పుష్పకి కావాల్సినంత మైలేజీ వస్తుంది. పైగా ఇండస్ట్రీలో తామంతా ఒక్కటే అనే మెసేజ్ బలంగా వెళ్తుంది. అందుకే మేకర్స్ ప్రభాస్ ను ఆహ్వానించినట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఈ వేడుక గురించి, ముఖ్య అతిధి గురించి ఎలాంటి అధికారిక లేదు కానీ సినీ వర్గాల్లో మాత్రం బలంగా ప్రచారం జరుగుతుంది.
Anchor Shyamala: కొత్త ఇల్లు చూపించిన యాంకర్.. బాబోయ్ ఇంద్రభవనమే!