సంజయ్ ఆరోగ్యం గురించి వస్తున్న పుకార్లను నమ్మకండి.. లెటర్ రిలీజ్ చేసిన మాన్యతా దత్..

  • Published By: sekhar ,Published On : August 12, 2020 / 02:40 PM IST
సంజయ్ ఆరోగ్యం గురించి వస్తున్న పుకార్లను నమ్మకండి.. లెటర్ రిలీజ్ చేసిన మాన్యతా దత్..

తాను సినిమాల నుంచి కాస్త‌ విరామం తీసుకుంటున్నానని, వైద్య చికిత్స కోసం వెళ్తున్నానని బాలీవుడ్ హీరో సంజయ్‌ద‌త్ ట్విట్టర్‌లో ప్రకటించారు. కాగా సంజయ్ దత్ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధ‌ప‌డుతున్నారు, చికిత్స కోసం అమెరికా వెళుతున్నారంటూ సోషల్ మీడియాలో పలు పుకార్లు వినిపిస్తున్నాయి.

కాగా ఈ వార్త వెలువ‌డ‌గానే ఆయ‌న అభిమానులు సంజ‌య్ ఆరోగ్యం కోసం సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్రార్థ‌న‌లు చేయ‌డం ప్రారంభించారు. సంజయ్ దత్ ఆరోగ్యం గురించి వస్తున్న పుకార్లపై ఆయన భార్య మాన్యత స్పందించారు. ఈ మేరకు ఆమె ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశారు.

‘సంజయ్‌ దత్‌ త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షిస్తూ విషెస్‌ తెలిపిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ కఠిన సమయాన్ని దాటేందుకు మీ అందరి తోడు కావాలి. గతంలో కూడా ఎన్నో ఆపదల నుంచి మా కుటుంబం బయటపడింది. ఈ ఇబ్బందికర పరిస్థితిని కూడా దాటేస్తాం అని పూర్తి నమ్మకం ఉంది. సంజయ్‌దత్‌ అభిమానులందరికి నా విజ్ఞప్తి ఒక్కటే.. దయచేసి పుకార్లను నమ్మకండి, వాటిని ప్రచారం చేయకండి. మీ తోడు మాకు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం’.. అంటూ మాన్యత లేఖలో పేర్కొన్నారు.Sanjay Dutt