Thugs Movie: రా యాక్షన్‌తో ఆకట్టుకుంటున్న ‘థగ్స్’ ట్రైలర్..!

ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ ‘థగ్స్’ తెలుగులో ‘కోనసీమ థగ్స్’ అనే టైటిల్‌తో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను పూర్తి రా-యాక్షన్ ఫిల్మ్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తుండగా.. భారీ చిత్రాల నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిబు తమీన్స్ కుమార్తె రియా శిబు హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై, జీయో స్టూడియోస్‌తో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో తమీన్స్ కుమారుడు హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతున్నాడు.

Thugs Movie: రా యాక్షన్‌తో ఆకట్టుకుంటున్న ‘థగ్స్’ ట్రైలర్..!

Trailer Of Thugs Movie Raw And Impressive Directed By Brinda

Thugs Movie: ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ డైరెక్ట్ చేస్తున్న పాన్ ఇండియా మూవీ ‘థగ్స్’ తెలుగులో ‘కోనసీమ థగ్స్’ అనే టైటిల్‌తో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను పూర్తి రా-యాక్షన్ ఫిల్మ్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తుండగా.. భారీ చిత్రాల నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిబు తమీన్స్ కుమార్తె రియా శిబు హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై, జీయో స్టూడియోస్‌తో కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో తమీన్స్ కుమారుడు హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతున్నాడు.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్ వీడియో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేయగా, తాజాగా ఈ సినిమా నుండి థియేట్రికల్ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్‌ను విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్, ఆర్య, అనిరుధ్ మరియు కీర్తి సురేష్‌లు డిజిటల్ ప్లాట్‌ఫాంలలో రిలీజ్ చేశారు. కోనసీమ థగ్స్ ట్రైలర్ చూస్తుంటే ఇదొక వయోలెన్స్‌తో కూడిన ఇంటెన్స్ మూవీ అని అర్థమవుతోంది. కోనసీమ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే ఈ సినిమా కథ ప్రేక్షకులకు గ్రిప్పింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతోంది. ఈ సినిమాలో సింహ, ఆర్.కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.

హ్రిదు హరూన్ శేషు అనే పాత్రలో రా అండ్ రస్టిక్ క్యారక్టరైజేషన్‌తో చూడగానే రిజిస్టర్ అయిపోతాడు. పాత్రకు అవసరమైన ఇంటెన్సిటీని చాలా బాగా క్యారీ చేశాడు. హ్రిదుకి నటుడిగా చాలా మంచి భవిష్యత్తు ఉండబోతోందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ సినిమాకు శామ్.సిఎస్ సంగీతం అందిస్తుండగా, ట్రైలర్‌లోని ఇంటెన్సిటీని మరింత పెంచేశాడు. ట్రైలర్‌తో ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ‘కోనసీమ థగ్స్’ బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా విజయాన్ని అందుంకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.