ఇద్దరు హీరోలతో వీడియోకాల్ మాట్లాడుతూ.. బన్నీ సీక్రెట్ బయటపెట్టేసింది..
లాక్డౌన్ : రానా దగ్గుబాటి, అల్లు అర్జున్లతో వీడియో కాల్ మాట్లాడిన త్రిష..
లాక్డౌన్ : రానా దగ్గుబాటి, అల్లు అర్జున్లతో వీడియో కాల్ మాట్లాడిన త్రిష..
కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం 21 రోజులు లాక్డౌన్ ప్రకటించగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇక సెలబ్రిటీలైతే షూటింగులకు దూరంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. తమ రోజువారి పనులను వీడియో రూపంలో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు.
తాజాగా చెన్నై పొన్ను త్రిష తన ఇద్దరు ఫ్రెండ్స్తో వీడియో కాల్ మాట్లాడింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. హోమ్ క్వారంటైన్లో ఉన్న నాకు ఇద్దరు ఫ్రెండ్స్ రానా దగ్గుబాటి, అల్లు అర్జున్ మంచి కంపెనీ ఇచ్చారని చెబుతూ.. బన్నీ సీక్రెట్ను బయటపెట్టేసింది. ఇన్స్టాలో 5.8 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న బన్నీ ఓ ప్రైవేట్ అకౌంట్ను నడుపుతున్నట్లు త్రిష వెల్లడించింది.
ఈ ప్రైవేట్ అకౌంట్ను కేవలం 250 మంది ఫాలో అవుతుండగా, ఇప్పటివరకు 744 పోస్టులు పెట్టినట్లు తెలుస్తోంది. తమిళ్లో అడపా దడపా సినిమాలు చేస్తూ బండి లాగిస్తున్న త్రిష తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ సినిమా నుంచి తప్పుకుని వార్తల్లో నిలిచింది.