బీజేపీ నేత వ్యాఖ్యలు : ఆవు మాంసమే కాదు కుక్కను కూడా తినండి

  • Published By: veegamteam ,Published On : November 5, 2019 / 06:38 AM IST
బీజేపీ నేత వ్యాఖ్యలు : ఆవు మాంసమే కాదు కుక్కను కూడా తినండి

పశ్చిమబెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ మరోసారి దుందుడుకు వ్యాఖ్యలు చేసిన వార్తల్లో నిలిచారు. మేథావుల మని చెప్పుకుంటూ తిరిగే కొంతమంది రోడ్డు పక్కన ఉండే దుకాణాల్లో బీఫ్  తింటున్నారనీ వ్యాఖ్యానించారు. వారు తినేది రోడ్డు పక్క షాపుల్లో బహిరంగంగా ఎందుకు తినటం..ఇళ్లకెళ్లి తినొచ్చు కదా అంటూ వెటకారంగా వ్యాఖ్యానించారు.

ఫ్ ఆరోగ్యానికి మంచిదని అంటున్న సదరు మేథావి వర్గం ఆరోగ్యంగా ఉంటుందంటే బీఫే కాదు కుక్క మాంసం కూడా తినండి..మిమ్మల్ని ఎవరు ఆపుతారు?  అంటూ ఎద్దేవా చేశారు.  బుర్ద్వాన్‌లో జరిగిన ‘గోప అష్టమి కార్యక్రమ్’‌లో దిలీప్ ఘోష్ మాట్లాడుతూ దిలీప్ ఘోష్ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఆవు మనకు తల్లిలాంటిది. ఆవు పాలు తాగుతున్నాం..దాన్ని చంపుకుని తినటం ఎంత ద్రోహం? ఇది ఇటువంటివారికి ఏం తెలుస్తుందని అన్నారు. ఎవరైనా వారి తల్లితో  అనుచితంగా ప్రవర్తిస్తే..ఊరుకుంటారా? మరి తల్లిలాంటి ఆవుని తినటమేంటి?  అని ప్రశ్నించారు. భరతమాత పవిత్ర గడ్డపై ఆవులను చంపడం, బీఫ్ తినడం నేరం’ అని దిలీప్ ఘోష్ అన్నారు.

స్వదేశీ ఆవులకు..విదేశీ ఆవులకు మధ్య తేడా గురించి చెప్పిన దిలీప్ ఘోష్ భారతీయ జాతి ఆవుల ప్రత్యేక లక్షణం ఉంది..దాని పాలలో బంగారం ఉంటుంది. అందుకే వాటి పాలు రంగు కొద్దిగా పసుపు రంగులో ఉంటుంది. తల్లిలాంటి ఆవుని తినటం నేరం కాక మరేమిటని ప్రశ్నించారు. అంతేకాదు స్వదేశీ ఆవులు మాత్రమే మనకు తల్లి లాంటివనీ అన్నారు దిలీప్ ఘోష్.