దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల ఆందోళన

  • Published By: venkaiahnaidu ,Published On : August 30, 2019 / 02:11 PM IST
దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల ఆందోళన

బ్యాంకుల విలీనం పై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి  నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు ప్రకటించారు. మొత్తం 10 ప్రభుత్వ బ్యాంకులను కేవలం నాలుగు బ్యాంకులుగా ఏర్పాటు విలీనం చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఇండియాలో  27 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉన్నాయని,ఇవాళ చేసిన ప్రకటనతో ఇకపై దేశంలో 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మాత్రమే ఉంటాయని ఆమె తెలిపారు.

అయితే నిర్మలా సీతారామన్ ప్రకటనపై ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్(AIBEA)జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం అసంతృప్తి వ్యక్తం చేశారు.  మెగా బ్యాంకులు,మెగా విలీనాలు అక్కర్లేదని ఆయన అన్నారు. మనది విస్తారమైన దేశం అని,లక్షలాది మంది గ్రామ ప్రజలు ఇప్పటికీ బ్యాంకు సౌకర్యం కలిగి లేరని ఆయన అన్నారు. కేంద్రం ప్రకటనను వ్యతిరేకిస్తూ శనివారం(ఆగస్టు-30,2019) దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు ఆయన తెలిపారు. తమ పోరాటం కొనసాగుతుందని ఆయన తెలిపారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB),ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ లు విలీనం అవబోతున్నాయని, 17.95 లక్షల కోట్ల బిజినెస్ తో రెండవ అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంకుగా అవతరించనున్నట్లు నిర్మలా సీతారామన్  తెలిపారు. 

సిండికేట్ బ్యాంకు,కెనరా బ్యాంక్  విలీనం ద్వారా 15.20లక్షల కోట్ల బిజినెస్ తో  నాల్గవ అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంకుగా అవతరించబోతున్నట్లు ఆమె తెలిపారు.
 
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు ఇకపై ఒకే బ్యాంకుగా అయ్యి  ఐదవ అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ గా ఇప్పుడు అవతరించినట్లు ఆమె తెలిపారు.

అలహాబాద్ బ్యాంకు ఇండియన్ బ్యాంక్ విలీనం ద్వారా 8.08లక్షల కోట్లతో ఏడవ అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ గా అవతరించబోతున్నట్లు ఆమె తెలిపారు.

జాతీయ స్థాయి కలిగిన…9.3లక్షల కోట్ల వ్యాపారంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా, 4.68లక్షల కోట్ల వ్యాపారంతో సెంట్రల్ బ్యాంకు కంటిన్యూ అవ్వాలని ఆమె తెలిపారు.