ఎంత కోటీశ్వరుడు అయితే మాత్రం : ఆ పాప డబ్బుపైనే నడుస్తుంది.. పడుకుంటోంది.. చుట్టూ నోట్ల కట్టలే

  • Published By: veegamteam ,Published On : April 16, 2019 / 11:23 AM IST
ఎంత కోటీశ్వరుడు అయితే మాత్రం : ఆ పాప డబ్బుపైనే నడుస్తుంది.. పడుకుంటోంది.. చుట్టూ నోట్ల కట్టలే

గుజరాత్ : ఇంట్లో తొలి సంతానం పుడితే తల్లిదండ్రులు ఎవరైనా ఏం చేస్తారు. స్థాయికి తగ్గట్టు కొందరు స్వీట్లు పంచుతారు, కొందరు భోజనాలు పెట్టిస్తారు. మరికొందరు ఊరంతా భోజనాలు పెట్టించి దాన ధర్మాలు చేస్తారు. ఆ జంట మాత్రం ఎవరూ ఊహించని విధంగా చేసింది. పాపపై నోట్ల వర్షం కురిపించింది. కరెన్సీ నోట్లతో పసికందుని కప్పేశారు. పాప చుట్టూ నోట్లు ఉంచారు. వినడానికి షాకింగ్ గా ఉన్నా ఇది నిజం. గుజరాత్ రాష్ట్రంలోని మాల్వీ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పాపని కరెన్సీ నోట్లతో కప్పి ఉంచిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రూ.2వేలు, రూ.200 నోట్లతో పాపని కప్పేశారు.

ఓ బిజినెస్ ఫ్యామిలీ ఇదంతా చేసింది. పాపపై తమకున్న ప్రేమను ఇలా చాటుకున్నారు. వారు ఇలా చేయడానికి కారణం లేకపోలేదు. పెళ్లైన 20 ఏళ్ల తర్వాత ఆ జంటకి పాప పుట్టింది. దీంతో వారి ఆనందానికి హద్దులు లేవు. సంతానం కోసం వారు ఎన్నో గుళ్లు, గోపురాలు తిరిగారట. ఎంతోమంది వైద్యులను సంప్రదించారట. దేవుళ్లు, దేవతలకూ మొక్కారట. ఇప్పటికి ఫలితం దక్కిందని ఆనందపడిపోతున్నారు. సాక్ష్యాత్తూ ఆ లక్ష్మీ దేవే తమ ఇంట అడుగుపెట్టిందని ఆ జంట సంతోషంగా ఉంది. పసికందుపై అపార ప్రేమను చూపిస్తూ నోట్ల వర్షం కురిపించింది. పాప పుట్టిన ఆనందంలో గ్రామంలో భారీ పూజ చేశారు. ఊళ్లో అందరిని పిలిచి భోజనాలు పెట్టించారు.