Malaria Cure: పిల్లలలో మలేరియా చికిత్స కోసం ‘చక్కర బిళ్లల’ను అభివృద్ధి చేసిన జేఎన్యూ పరిశోధకులు
భారత్ లోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్యు) పరిశోధకుల బృందం చిన్నారుల్లో మలేరియా చికిత్సకు ఒక ప్రత్యేకమైన ఔషధాన్ని అభివృద్ధి చేసింది.

Malaria Cure: తీవ్రమైన వ్యాధిగా పరిగణిస్తున్న మలేరియా నివారణ, చికిత్సకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సవాలుగా మారిన మలేరియాకు.. ప్రభావవంతమైన మందులు మరియు చికిత్సను అభివృద్ధి చేయడానికి పరిశోధకులు కృషి కొనసాగుతూనే ఉంది. ఈక్రమంలో భారత్ లోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్యు) పరిశోధకుల బృందం చిన్నారుల్లో మలేరియా చికిత్సకు ఒక ప్రత్యేకమైన ఔషధాన్ని అభివృద్ధి చేసింది. చక్కెర ఆధారిత బిళ్లలు..చిన్నారుల్లో మలేరియా చికిత్సకు ఉపయోగించవచ్చని పరిశోధకులు గుర్తించారు. చక్కెరలో సహజంగా ఉండే ఆల్కహాల్ మలేరియాకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు పరిశోధనలో తేలింది.
Other Stories:Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తికి కారణం కరోనా వ్యాక్సినేనా? కుట్ర కోణం ఉందన్న కుట్ర సిద్ధాంతకర్తలు
తీపి కోసం సాధారణంగా వినియోగించే ఎరిథ్రిటాల్(Erythritol) అని పిలువబడే ఈ రకమైన పదార్ధాన్ని శక్తివంతమైన యాంటీమలేరియల్గా పనిచేస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఐదేళ్ల లోపు చిన్నారుల్లోనూ ఇది ఎంతో సమర్ధంగా పనిచేస్తున్నట్టు జేఎన్యూ ప్రొఫెసర్ శైలజా సింగ్ తెలిపారు. ఎరిథ్రిటాల్(Erythritol) చక్కెర ప్రత్యామ్నాయంగా ఉపయోగించే ఒక సేంద్రీయ సమ్మేళనం. “పిల్లల్లో చక్కెర బిళ్లలతోనే మలేరియాను నయం చేయగలిగినప్పుడు..ఇక వేరే చికిత్సలు ఎందుకు? అదే మేము ఇక్కడ చేయాలనుకుంటున్నాము” అని ప్రొఫెసర్ శైలజా సింగ్ తన కొత్త పరిశోధనల గురించి చెప్పారు.
Other Stories:Assam Floods: అస్సాంలో తెగిపడిన రైల్వే లైన్ల పునరుద్ధరణకు రూ.180 కోట్లు మంజూరు చేసిన కేంద్రం
BioXRivలో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, మలేరియా పరాన్నజీవి ఆక్వాపోరిన్ ఛానల్ను ఎరిథ్రిటాల్ బందించి మలేరియా పరాన్నజీవి పెరుగుదలను నిరోధిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏయేటికాయేడు..మలేరియా కేసులు పెరుగుతూన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 2019లో 227 మిలియన్ మంది మలేరియా భారిన పడగా..2020లో ఆసంఖ్య 241 మిలియన్ కు చేరింది. రానున్న రోజుల్లో ప్రపంచ జనాభాలో సగం మంది మలేరియా భారిన పడే అవకాశం ఉన్నట్లు WHO అంచనా వేసింది.
1Maharashtra Politics : ‘మహా’ రాజకీయం.. రాజ్ ఠాక్రేతో ఫోన్లో ఏక్ నాథ్ షిండే మంతనాలు!
2Nizamabad: ప్రైవేటు ఆసుపత్రి నిర్వాకం.. కోమా పేషెంట్ నగలు మాయం
3San Antonio: అమెరికాలో దారుణం.. ట్రక్కులో 46 మృతదేహాలు.. 16మంది మాత్రం..
4Vidyut Jamwal : నేను చూసిన బెస్ట్ డ్యాన్సర్ ఎన్టీఆర్.. ఎన్టీఆర్తో టచ్లో ఉంటా అంటున్న బాలీవుడ్ హీరో..
5Al Qaeda Attacks : దేశంలో భారీ ఉగ్రదాడులకు అల్ఖైదా కుట్ర
6Siddipet: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. ఆసుపత్రిలో విద్యార్థులు
7Top Gun Maverick : అక్షరాలా వంద కోట్ల డాలర్లు.. నెల రోజుల్లో సాధించి సరికొత్త రికార్డు సృష్టించిన టామ్ క్రూజ్..
8Mohan Babu: నేడు తిరుపతి కోర్టుకు హాజరుకానున్న మోహన్ బాబు, ఆయన కుమారులు
9PM Modi: మోదీకి జో బైడెన్ ఆత్మీయ పలకరింపు.. జీ-7 సదస్సులో ఆసక్తికర దృశ్యం
10Mahindra Scorpio-N: మార్కెట్లోకి మహీంద్రా స్కార్పియో-ఎన్.. కేవలం రూ.11.99లక్షలు మాత్రమే
-
Justice Ujjal Bhuyan : నేడు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఉజ్జల్ భూయన్ ప్రమాణస్వీకారం
-
CM KCR : నేడు టీహబ్-2ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
-
Agent: ఏజెంట్ ట్విస్టుకు ఫ్యూజులు ఎగరాల్సిందేనా..?
-
Kolkata Student : జేయూ విద్యార్థికి 3 జాబ్ ఆఫర్లు.. గూగుల్, అమెజాన్ వద్దన్నాడు.. ఫేస్బుక్లో భారీ ప్యాకేజీ కొట్టేశాడు!
-
Maa Neella Tank: ఆకట్టుకుంటున్న మా నీళ్ల ట్యాంక్ టీజర్.. ఇది ఒరిజినల్!
-
OnePlus 10T 5G : వన్ప్లస్ 10T 5G ఫోన్ వస్తోంది.. ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?
-
Nagarjuna: ‘సర్దార్’ను పట్టేసుకున్న నాగార్జున!
-
Microsoft Alert : మైక్రోసాఫ్ట్ అలర్ట్.. Windows 8.1కి సపోర్టు ఆపేస్తోంది.. వెంటనే Upgrade చేసుకోండి!