మద్యానికి డబ్బులు ఇవ్వలేదని గర్భిణీ భార్యను కాల్చేశాడు

  • Published By: Subhan ,Published On : May 5, 2020 / 12:04 PM IST
మద్యానికి డబ్బులు ఇవ్వలేదని గర్భిణీ భార్యను కాల్చేశాడు

కట్టలు తెంచుకుని వస్తుంది ఆవేశం. లాక్‌డౌన్ పుణ్యమా అని 42రోజులుగా మద్యానికి బ్రేకులు వేసిన మందుబాబులు రాష్ట్రప్రభుత్వాలు మద్యం అమ్మకాలకు సడలింపులు ఇవ్వగానే రెచ్చిపోతున్నారు. గంటల తరబడి కిలోమీటర్ల మేర లైన్లలో నిల్చొని తంటాలు పడి మరీ కొనుక్కుంటున్నారుప. యూపీలో మద్యానికి బానిస అయిన వ్యక్తి తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో గర్భిణీగా ఉన్న భార్యను నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాడు. 

ఉత్తరప్రదేశ్ లోని జాన్పూర్ లో ఈ ఘటన జరిగింది. దీపక్ సింగ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు. మందుకొనుక్కోవాలని భార్య నేహాను డబ్బులు అడగడంతో ఆమె నిరాకరించింది. అంతే వాదన పెరిగి తుపాకీ తీసుకుని తలకు గురిపెట్టి కాల్చాడు. ఆ ఘటనను అక్కడే ఉండి చూస్తున్న నాలుగేళ్ల కొడుకు తల్లిని షూట్ చేయడంతో భయపడి పొదల్లోకి వెళ్లి దాక్కున్నాడు. 

స్థానికులు శబ్దం విని అక్కడికి చేరుకుని మహిళను హాస్పిటల్ లో  చేర్పించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. మహిళ చనిపోవడంతో మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. బాలుడు పొదల్లో దాక్కున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆమె నాలుగు నెలల గర్భవతి అని .. ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ నేహా సోదరుడు కంప్లైంట్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Also Read | ఇంట్లోనే వైన్ తయారుచేస్తున్న తండ్రి-కొడుకులు అరెస్టు