కట్నం కోసం భార్యను హత్య చేశాడు…. సూట్ కేసులో దాచాడు

  • Published By: madhu ,Published On : July 29, 2020 / 01:11 PM IST
కట్నం కోసం భార్యను హత్య చేశాడు…. సూట్ కేసులో దాచాడు

కట్నం కోసం భార్యను చంపేశాడో ఓ భర్త. ఇతనికి తల్లిదండ్రులు కూడా సహకరించారు. అనంతరం ఆ డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి…బయటపడేశారు. ఈ దారుణమైన ఘటన ఘజియాబాద్ లో చోటు చేసుకుంది.



ఘజియాబాద్ లోని Sahibabad ప్రాంతంలో సూట్ కేసులో డెడ్ బాడీ ఉందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మహిళను వేరే చోట హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని భావించారు. క్లూ సంపాదించేందుకు పోలీసులు ప్రయత్నించారు. సమీపంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ లను పరిశీలించారు.

ఇందుకు సోషల్ మీడియాను ఎంచుకున్నారు. 1500 WhatsApp గ్రూప్ లో ఆమె ఫొటోను షేర్ చేయడం జరిగిందని సీనియర్ పోలీస్ సూపరిటెండెంట్ కలానిధి వెల్లడించారు. ఈ సమాచారాన్ని ఇతర పోలీసు అధికారులకు ఇచ్చామన్నారు.



ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లో ఉంటున్న బాధితురాలి బంధువు గుర్తు పట్టినట్లు, ఆమె ఇతర కుటుంబసభ్యులకు సమాచారం అందించి…పోలీసులను సంప్రదించారని ఆయన తెలిపారు. ఆలీఘర్ లో నివాసం ఉంటున్న జాఫర్ ఆలీ కుమార్తె బరీషా (25)గా గుర్తించారు.

ఇటీవలే వివాహం జరిగింది. బులంద్ షహర్ జిల్లాలో అత్తగారింట్లో నివాసం ఉంటోందని ఆమె వెల్లడించిందన్నారు. ఆ మహిళ తల్లిదండ్రులు అత్తగారింటిపై 2020, జులై 25వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారని, కట్నం తేవాలంటూ..ఒత్తిడి తెస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు.



అనంతరం ఆమె ఆచూకీ తెలియలేదని, రెండు రోజుల తర్వాత.. ఆమె మృతదేహం ఘజియాబాద్ లో లభించిందన్నారు. దీంతో భర్త, అతని తల్లిదండ్రులను 2020, జులై 28వ తేదీ మంగళవారం బులంద్ షహర్ లో అదుపులోకి తీసుకున్నామన్నారు. అదనపు కట్నం తేవాలని మహిళను చంపారని, అనంతరం సూట్ కేసులో మృతదేహం పెట్టి సాహిబాబాద్ ప్రాంతంలో పడేశారన్నారు.

పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలిచినట్లు, ఈ ప్రక్రియ వీడియో తీయించడం జరిగిందన్నారు. అనంతరం డెడ్ బాడీని ఆమె తల్లిదండ్రులకు అప్పగిస్తామని SSP నైతాని తెలిపారు. ఈ కేసును త్వరగా చేధించిన పోలీసు టీంకు రూ. 15 వేలు రివార్డు ఇచ్చినట్లు నైతాని వెల్లడించారు.