Pm Modi: మళ్లీ చెలరేగుతున్న కరోనా.. సీఎంలతో భేటీకి పీఎం మోడీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మరోసారి చెలరేగుతుండటంతో సీఎంలతో సమీక్షించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12గంటల 30నిమిషాల సమయంలో వర్చువల్ ఇంటరాక్షన్ జరగనుంది.

Pm Modi: మళ్లీ చెలరేగుతున్న కరోనా.. సీఎంలతో భేటీకి పీఎం మోడీ

Modi Cm Meet

Pm Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మరోసారి చెలరేగుతుండటంతో సీఎంలతో సమీక్షించనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12గంటల 30నిమిషాల సమయంలో వర్చువల్ ఇంటరాక్షన్ జరగనుంది.

గతంలో రోజుకు 10వేల వరకూ నమోదవుతున్న కొవిడ్ కేసులు రెట్టింపు అవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 26వేల 291కేసులు ఫైల్ అయ్యాయి. 85రోజుల్లో నమోదు కాని కేసులు ఇప్పుడే అత్యధికంగా ఉన్నాయి. మహమ్మారి వ్యాప్తి కారణంగా 24గంటల్లో లక్షా 58వేల 725మంది బాధపడుతుంటే 118మంది మృత్యువాతపడ్డారు.

ఇండియాలో ప్రస్తుతం 2లక్షల 19వేల 262యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశం మొత్తంలో నమోదైన కేసుల్లో ఇది 1.93శాతం మాత్రమే. ఇదిలా ఉంటే రికవరీ రేటు 96.68శాతానికి పడిపోయింది.

ఓ ఐదు రాష్ట్రాల్లో మాత్రం కరోనావైరస్ లెవల్స్ పెరుగుతూనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ రిపోర్టులు చెబుతున్నాయి. మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడులలో ఎక్కువగా ఉండగా మహారాష్ట్ర పరిస్థితి దారుణంగా మారింది. కేరళలో కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.