Rajasthan : చాక్లెట్ల ఆశ చూపి ఇంటికి తీసుకెళ్లి పిల్లలపై హెడ్‌మాస్టర్ అఘాయిత్యం, ఆ వీడియోలకు బానిసగా మారి ఇలా..

Rajasthan : బూతు వీడియోలు చూసేవాడని పోలీసుల విచారణలో తేలింది. అందుకే చిన్నారులపై అఘాయిత్యం చేసినట్లు నిర్ధారించారు.

Rajasthan : చాక్లెట్ల ఆశ చూపి ఇంటికి తీసుకెళ్లి పిల్లలపై హెడ్‌మాస్టర్ అఘాయిత్యం, ఆ వీడియోలకు బానిసగా మారి ఇలా..

Rajasthan (Photo : Google)

Rajasthan – Head Master : గురువంటే దైవంతో సమానం అంటారు. ఎందుకంటే పిల్లలకు విద్యాబుద్ధులతో సభ్యత, సంస్కారం నేర్పి వారు సన్మార్గంలో వెళ్లేలా చూసేది గురువే. పిల్లలు తప్పు చేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయుడే తీసుకుంటాడు. అందుకే, గురువన్నా, టీచర్ వృత్తి అన్నా అంత గౌరవం ఇస్తారు. అయితే, కొందరు వ్యక్తులు తప్పుడు పనులతో పవిత్రమైన టీచర్ వృత్తికి కళంకం తెస్తున్నారు. పిల్లలకు మంచి చెప్పాల్సిన టీచర్లే దారి తప్పుతున్నారు. కొందరు కామంతో రగిలిపోతూ కీచకుల్లా మారుతున్నారు. తాజాగా ఓ హెడ్ మాస్టర్ బరితెగించాడు. దారుణానికి ఒడిగట్టాడు. ఆరుగురు విద్యార్థినులను రేప్ చేశాడా నీచుడు.

హెడ్ మాస్టర్ కాదు కామాంధుడు:
రాజస్తాన్ లోని దుంగార్ పూర్ లో దారుణం వెలుగుచూసింది. సభ్య సమాజం ఉలిక్కిపడే ఘోరం బయటపడింది. ఓ ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ రమేశ్ చంద్ర కటారా పిల్లలపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన హెడ్ మాస్టర్.. ఆరుగురు విద్యార్థినులపై అత్యాచారానికి పాల్పడ్డాడు.(Rajasthan)

చాక్లెట్లు, చిప్స్ ఆశ చూపించి..
ఓ బాలిక ఫిర్యాదుతో కీచక హెడ్ మాస్టర్ బాగోతం బట్టబయలైంది. పోలీసులు ఆ కామాంధుడిని అరెస్ట్ చేశారు. విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. హెడ్ మాస్టర్ రమేశ్ చంద్ర.. బూతు వీడియోలు చూసేవాడని తేలింది. అందుకే చిన్నారులను రేప్ చేసినట్లు నిర్ధారించారు. స్కూల్ లో 8 నుంచి 12ఏళ్ల మధ్య ఉండే పిల్లలను రమేశ్ చంద్ర టార్గెట్ చేసేవాడు. పిల్లలకు చాక్లెట్లు, చిప్స్ ఆశ చూపించి వారిని ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసేవాడని పోలీసుల విచారణలో వెలుగుచూసింది.

Also Read..Hyderabad : హయత్‌నగర్ వృద్ధురాలి మర్డర్ కేసుని 24గంటల్లోనే ఛేదించిన పోలీసులు.. చంపింది ఎవరో, ఎందుకో తెలుసా

 

ఉలిక్కిపడ్డ విద్యార్థులు తల్లిదండ్రులు:
ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. హెడ్ మాస్టర్ నిజస్వరూపం బయటపడటంతో అంతా ఉలిక్కిపడ్డారు. కామంతో కళ్లు మూసుకుపోయి పిల్లల పట్ల అమానుషంగా వ్యవహరించి ఆ కీచక హెడ్ మాస్టర్ ని చంపినా పాపం లేదంటున్నారు స్థానికులు. ఆడపిల్లలకు ఎక్కడా రక్షణ లేకుండా పోయిందని స్థానికులు వాపోయారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువే ఇలా దారుణానికు ఒడిగడితే.. ఇక సభ్య సమాజం ఏమైపోతుందోనని ఆందోళన చెందుతున్నారు.(Rajasthan)

బూతు వీడియోలకు బానిసగా మారి దారుణాలు:
తాను బూతు వీడియోలు చూస్తుంటానని, ఆ వీడియోలకు బానిసగా మారానని, ఈ క్రమంలోనే పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడ్డానని పోలీసుల విచారణలో కీచక హెడ్ మాస్టర్ ఒప్పుకున్నాడు. స్కూల్లో ఉండే 8 నుంచి 12ఏళ్ల బాలికలను టార్గెట్ చేసేవాడినని చెప్పాడు. వారికి చాక్లెట్లు, చిప్స్ ఆశ చూపి ఇంటికి తీసుకెళ్లేవాడినని తెలిపాడు. ఒకవేళ వాళ్లు ఒప్పుకోకుంటే వారిని బెదిరించే వాడినని చెప్పాడు.

Also Read..Tirupati : పోలీసులకు పుష్ప సినిమా చూపించిన స్మగ్లర్లు

హెడ్ మాస్టర్.. సెలవు రోజుల్లో ఆటల పేరుతో అమ్మాయిలను స్కూల్ కి రప్పించేవాడని, ఆ తర్వాత వారిని ఎవరూ లేని తన ఇంటికి తీసుకెళ్లి రేప్ చేసేవాడని పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత వారికి డబ్బు ఇచ్చి చాక్లెట్లు, చిప్స్, బిస్కెట్స్ కొ నుక్కోమని చెప్పేవాడని పోలీసులు తెలిపారు. మే 31న తొలిసారిగా హెడ్ మాస్టర్ కీచక పర్వం వెలుగుచూసింది. పోక్సో చార్జెస్ కింద జూన్ 3న పోలీసులు హెడ్ మాస్టర్ ని అరెస్ట్ చేశారు.