అపూర్వ ఆధ్యాత్మిక సంగమం : అర్థ కుంభమేళా ప్రారంభం

  • Published By: veegamteam ,Published On : January 15, 2019 / 03:25 AM IST
అపూర్వ ఆధ్యాత్మిక సంగమం : అర్థ కుంభమేళా ప్రారంభం

ప్రయాగ్‌రాజ్ : అపూర్వ ఆధ్యాత్మిక సంగమం.. వేల సంవత్సరాల విశ్వాసానికి తార్కాణం… ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ధార్మిక సమ్మేళనం… కోట్లాదిమంది ఒక్కచోట చేరే అద్భుత ఘట్టం.. పవిత్ర స్నానాలు ఆచరించే పుణ్య సమయం.. అదే కుంభమేళా. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో అర్ధకుంభమేళా ఘనంగా ప్రారంభమైంది. నాగ సాధువుల మంగళ స్నానాలతో 2019, జనవరి 15వ తేదీ మంగళవారం ప్రారంభమైన కుంభమేళా 8 వారాల పాటు(మార్చి 4వ తేదీ) సాగనుంది. కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు దేశంలోని నలు మూలల నుంచి సాధువులు భారీ ర్యాలీగా ప్రయాగ చేరుకున్నారు. 10 అఖాడాలకు చెందిన స్వాములు స్నానాలు ఆచరించారు.

* కుంభమేళాకు భారీగా తరలి వచ్చిన నాగ సాధువులు
* సాధువుల స్నానాలతో మొదలైన కుంభమేళా
* దేశం నలుమూలల నుంచి వచ్చిన భారీగా వచ్చిన భక్తులు

కుంభమేళా… సనాతన భారతీయ జీవనశైలికి, మన సాంస్కృతిక వారసత్వానికి, సంప్రదాయాలకు అద్దం పడుతోంది. 8 వారాల పాటు జరిగే ఈ మేళాకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. ఆధ్యాత్మిక, రాజకీయ, పర్యాటక సంగమమైన ఈ మహా ఉత్సవంలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ప్రయాగ్‌రాజ్‌కు తరలివస్తున్నారు.

* అర్థ కుంభమేళాకు పోటెత్తిన భక్తులు
* తెల్లవారుజామున లాంఛనంగా ప్రారంభమైన కుంభమేళా
* ప్రపంచం నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తులు
* పవిత్ర త్రివేణీ సంగమంలో తొలి పవిత్ర స్నానాలు
* కుంభమేళాకు భారీగా తరలి వచ్చిన నాగా సాధువులు
* సాధువుల స్నానాలతో మొదలైన కుంభమేళా
* దేశం నలుమూలల నుంచి వచ్చిన భారీగా వచ్చిన భక్తులు

49 రోజులపాటు జరిగే అర్ధ కుంభమేళాకు యోగి అదిత్యానాథ్ ప్రభుత్వం 4వేల కోట్ల రూపాయలు కేటాయించింది. 192 దేశాల నుంచి 12 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. తొలి రోజు 30 లక్షల మంది స్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచనా. 2,800 కోట్లతో దాదాపు 250 కిలోమీటర్ల పొడవైన రోడ్లు, గంగా నది ఒడ్డులను కలుపుతూ 22 వంతెనలు నిర్మించారు.