రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు.. కాంగ్రెస్ అగ్రనేతలతో కలిసి రోడ్ షో
Rahul Gandhi: ఇందులో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా..
ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ఆయన వెంట సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రా కూడా ఉన్నారు. అమేథీ, రాయ్బరేలీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను పోటీలో నిలపడంపై ఆ పార్టీ ఇవాళ ఉదయం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
నామినేషన్లకు ఇవాళే చివరి తేదీ. దీంతో ఆ రెండు స్థానాల కాంగ్రెస్ అభ్యర్థులు ఇవాళ నామినేషన్లు దాఖలు చేశారు. ప్రియాంక గాంధీ వాద్రాను రాయ్బరేలీ నుంచి పోటీకి దింపుతారని అందరూ భావించారు. అయితే, అది సాధ్యం కాలేదు. ఈ నియోజక వర్గానికి సోనియా గాంధీ చాలా ఏళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు.
నామినేషన్ దాఖలు చేసిన తర్వాత రాహుల్ గాంధీ మెగా రోడ్షో నిర్వహిస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేతలు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా కూడా పాల్గొన్నారు.
రాహుల్ గాంధీ కేరళలోని వయానాడ్ నుంచి కూడా పోటీ చేశారు. ఆ స్థానానికి ఇప్పటికే ఎన్నికలు ముగిశాయి. 2019 లోక్సభ ఎన్నికల్లోనూ రాహుల్ గాంధీ వయానాడ్, అమేథీ నుంచి పోటీ చేశారు. అప్పట్లో అమేథీలో స్మృతీ ఇరానీ గెలిచారు. వయానాడ్ లో రాహుల్ గాంధీ విజయం సాధించారు.
Also Read: మే 13న నాలుగో విడత పోలింగ్.. ఎంత మంది పోటీలో ఉన్నారంటే?