మోడీ పిచ్చి ఫ్యాన్..కన్నుమూత

మోడీ పిచ్చి ఫ్యాన్..కన్నుమూత

Santosh Jha a die hard Modi fan : వివిధ రంగాల్లో ఉన్న వారికి ఎంతో మంది అభిమానులు ఉంటారు. కొందరైతే వారిని విపరీతంగా ఆరాధిస్తుంటారు..అభిమానిస్తుంటారు. పచ్చబొట్లు, వారిలా తయారు కావడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఇందులో సినిమా, రాజకీయ, క్రికెట్, వివిధ రంగాలకు చెందిన వారిని ఇష్టపడుతుంటారు. అందులో సంతోష్ ఝూ ఒకరు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అంటే ఎంతో అభిమానం. మోడీ పాల్గొనే…బహిరంగసభల్లో సంతోష్ ఝా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాడు.

బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే సందర్భంలో…బీజేపీ ఏర్పాటు చేసిన సభలో ఇతను పాల్గొంటాడు కానీ..కెమెరా ముందుకు రాడు. ఎందుకు అతని విషయం చెబుతున్నారు ? అని అనుకుంటున్నారా ? ప్రస్తుతం ఇతను మనమధ్య లేడు. బుధవారం కన్నుమూశాడు. దర్బంగాకు చెందిన సంతోష్ ఝూ విశేష గుర్తింపు పొందారనే చెప్పవచ్చు. మోడీని అమితంగా ఆరాధిస్తుంటాడు. మోడీ ర్యాలీల్లో పాల్గొనే ముందు..తన శరీరమంతా..పెయిటింగ్ వేయించుకుంటాడు.

కమలం గుర్తును కూడా ముద్రించుకుంటాడు. అతని వేషధారణ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. చేతిలో ప్లకార్డు పట్టుకుని..జై శ్రీరాం..హర్ హర్ మోదీ..ఘర్ ఘర్ మోదీ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ…ఇతరుల్లో జోష్ నింపుతుంటాడు. సభలో వాతావరణాన్ని మరింత ఉత్సాహ పరుస్తుంటాడు. ర్యాలీలో పాల్గొనేందుకు డబ్బులు లేకపోవడంతో తన ఉపాధి కల్పించే ఆటోను సైతం అమ్మేశాడు. వచ్చిన డబ్బుతో మోడీ పాల్గొనే ర్యాలీలో పాల్గొనేవాడు. తాజాగా..ఇతను చనిపోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.