బ్రాహ్మణ యువతితో దళిత ఎమ్మెల్యే ప్రేమ వివాహం…..యువతి తండ్రి ఆత్మహత్యా యత్నం

  • Published By: murthy ,Published On : October 6, 2020 / 01:53 PM IST
బ్రాహ్మణ యువతితో దళిత ఎమ్మెల్యే ప్రేమ వివాహం…..యువతి తండ్రి ఆత్మహత్యా యత్నం

aiadmk dalit mla:తమిళనాడులో అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రేమ వివాహం సంచలనం రేపింది. కులాంతర వివాహాం కావటం, ఇద్దరి మధ్య దాదాపు 15 ఏళ్లపైన వయస్సు వ్యత్యాసం ఉండటంతో వధువు తరుఫువారు అభ్యంతరం చెపుతున్నారు. ఎమ్మెల్యే తమను బెదిరించి వివాహాం చేసుకున్నాడని.. మనస్తాపంతో వధువు తండ్రి ఆత్నహత్యాయత్నం చేశారు.

అధికార అన్నాడీఎంకే ఎమ్మెల్యే ప్రభు(36) కళ్లకురిచ్చి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతను తియగదురగంలో బీఏ రెండో సంవత్సరం చదువుతున్న సౌందర్య(19) అనే యువతిని గత నాలుగు నెలలగా ప్రేమిస్తున్నాడు. సౌందర్య తండ్రి ఒక దేవాలయంలో అర్చకుడిగా పని చేస్తున్నాడు. సౌందర్య కూడా ఎమ్మెల్యేను ప్రేమించింది. అమ్మాయి తండ్రి ఈ ప్రేమను అంగీకరించలేదు.



దీంతో ఎమ్మెల్యే ప్రభు తన సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సౌందర్య మెడలో అక్టోబర్5న తాళి కట్టాడు. తియగదురగంలోని ఎమ్మెల్యే ఇంట్లో నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది.అయితే ఎమ్మెల్యే ప్రభు తన కుమార్తెకు మాయమాటలు చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని సౌందర్య తండ్రి గురుక్కుల్ స్వామినాథన్ ఆరోపించారు.                     soundarya fatherపెళ్లికి ఒప్పుకోకపోతే మమ్మల్ని చంపేస్తామని బెదిరించాడని ఆయన పేర్కొన్నాడు. అక్టోబర్ 1వ తేదీసాయంత్రం 4 గంటల సమయంలో తన కుమార్తెను మాయ మాటలు చెప్పి ప్రభు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లాడని సౌందర్య తండ్రి ఆరోపిస్తున్నారు.



ప్రభు కుటుంబంతో తమకు పరిచయం ఉందని. ఇక్కడ కులం సమస్య కాదని.. ఇద్దరి మధ్య వయస్సు భేదం వల్ల తాను ఒప్పుకోలేనని..ప్రభు మాయమాటలతోనాలుగేళ్ళుగా ప్రేమిస్తున్నాడని కూడా ఆయన ఆరోపించాడు.



కూతురు పెళ్లిని అంగీకరించని స్వామి నాధన్ వివాహం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యే ఇంటివద్ద పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. స్థానికులు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో ఎమ్మెల్యే ప్రభు పెళ్లి తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా ఆత్మహత్యాయత్నం చేసుకున్నస్వామి నాధన్ పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 309 కింద కేసునమోదు చేశారు.