ఐపీఎల్ 2021 వేలం : ముంబై జట్టులోకి సచిన్ కొడుకు అర్జున్.. ఎంఐ ఎంతపెట్టి కొన్నదంటే?
Arjun Tendulkar join Mumbai Indians IPL Aution 2021 : వచ్చే సీజన్ కోసం ఐపీఎల్ 2021 మినీ వేలంలో దిగ్గజ ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఎప్పటిలానే ఈసారి సీజన్ 14 కోసం ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆటగాళ్లపై బిడ్డింగ్ చేశాయి. ఆటగాళ్ల ప్రదర్శన బట్టి ప్రాంఛైజీలు ఒక్కో ఆటగాడిపై భారీ బిడ్ వేసి సొంతం చేసుకున్నాయి.
అందులో ముంబై ఫ్రాంచైజీ క్రికెట్ దేవుడు లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ను కొనుగోలు చేసింది. ఫస్ట్ టైం ఐపీఎల్ వేలంలో పాల్గొనగా.. అర్జున్ను కొనుగోలు చేసేందుకు ముంబై ఆసక్తి చూపింది. కనీస ధర కింద రూ.20 లక్షలకు ముంబై అతన్ని సొంతం చేసుకుంది.
Arjun Tendulkar joins @mipaltan for INR 20 Lac. @Vivo_India #IPLAuction
— IndianPremierLeague (@IPL) February 18, 2021
దేశీయ అన్ క్యాప్డ్ ఆటగాళ్ల జాబితాలో అర్జున్ కు మాత్రమే చోటు దక్కింది. ముంబై మాత్రమే అర్జున్ పై బిడ్ వేసింది. వేలానికి ముందు అర్జున్ పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ చివరికి రూ.20 లక్షల కనీస ధరకే అర్జున్ ను ముంబై దక్కించుకుంది.