Home » Chandrababu
యువగళం ముగింపు సభకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ సభనుంచే టీడీపీ,జనసేన కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయి. ఇదే సభ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.
భవిష్యత్తులో ఇరు పార్టీల నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి.. మంచి ప్రభుత్వం, పరిపాలన అందించాలని నిర్ణయించారు..
చంద్రబాబు హయాంలో విశాఖకు తీసుకొచ్చిన సాఫ్ట్ వేర్ కంపెనీలన్నీ.. మీ దోపిడీ వల్ల, మీ ధనదాహం వల్ల వెనక్కి వెళ్ళిపోయాయి. చంద్రబాబు చేపట్టిన పనులు కంటిన్యూ చేసి ఉంటే ఈరోజుకి ఎయిర్ పోర్టు వచ్చేది. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందేది.
మరో రెండు నెలల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతుందని సీఎం జగన్ తమ పార్టీ లీడర్లను అప్రమత్తం చేయడంతో ఒక్కసారిగా పరిస్థితిలో మార్పు వచ్చింది.
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి జిల్లా నుంచి చాలామంది నేతలు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదు? అని ప్రశ్నించారు పేర్నినాని. ఒక మెడికల్ కాలేజీ కానీ, పోర్టు కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ ఎందుకు నిర్మించలేదని నిలదీశారు.
జనవరిలో సైకిల్ స్పీడ్ పెరిగి, ఫ్యాన్ రెక్కలు విరగ్గొడుతుందని అన్నారు. చిల్లు పడిన వైసీపీ నావ త్వరలోనే మునిగిపోతుందన్నారు. 3 నెలల తర్వాత జగన్ ఎక్కడికి పోతారో తెలియదన్నారు చంద్రబాబు.
6 నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున తరలి వచ్చిన వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు.
చంద్రబాబును ప్రజలు ఎప్పుడో తిరస్కరించారని తెలిపారు. చంద్రబాబు హయాంలో తుఫాన్ బాధితులను ఆదుకున్న దాఖలాలు లేవన్నారు.
నియోజకవర్గాల మార్పులు రాజకీయాల్లో కొత్త కాదన్నారు. మంచి ఫలితాల కోసమే మార్పులు జరిగాయని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేశామని తెలిపారు.