Home » Michaung Cyclone
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను స్వయంగా కలిసి వారి కష్టాలు తెలుసుకున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
పంటలు నష్టపోయిన రైతాంగానికి నష్ట పరిహారం ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరారు. వరద బాధితులకు వసతి, ఆహారం, అవసరమైన మందులు సరఫరా చేయాలని సూచించారు.
ఏపీ ప్రభుత్వం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి తుపాను ప్రభావంపై అధికారులతో సమీక్షించారు.
ఇల్లందు సింగరేణి ఏరియాలో వర్షాలు కురుస్తున్నాయి. కోయగూడెం ఉపరితల గనిలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.
నెల్లూరు జిల్లాపై మిచాంగ్ తీవ్ర తుఫాన్ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత మైపాడు- రామతీర్థం మధ్యలో తీవ్ర తుఫాన్ పాక్షికంగా తీరాన్ని తాకింది.
తుపాను కారణంగా తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం తెల్లవారు జాము నుంచి చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలో భారీ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారిపోయాయి.
నెల్లూరు జిల్లాను మిచాంగ్ తుఫాన్ వణికిస్తోంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. తిరుమలలో ఆదివారం ఉదయం 8 గంటల నుండి సోమవారం ఉదయం 8 గంటల వరకు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
మిచాంగ్ తుఫాన్ నేడు (సోమవారం) కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుంది. రేపు (మంగళవారం) మధ్యాహ్నం నెల్లూరు - మచిలీపట్నం మధ్య మిచాంగ్ తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది.
ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు జిల్లా కలెక్టర్ హరి నారాయన్ ఆదేశాలు జారీ చేశారు. కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు.
ఏపీకి మిచాంగ్ తుపాన్ ముప్పు పొంచి ఉంది.