Malla Reddy IT Raids : కట్టల కట్టల డబ్బు.. మంత్రి మల్లారెడ్డి బంధువులు, సన్నిహితుల ఇళ్లలో కోట్ల రూపాయల నగదు సీజ్

మంత్రి మల్లారెడ్డి సమీప బంధవు నివాసంలో దాడులు చేపట్టిన ఐటీ అధికారులు రూ.2 కోట్ల నగదు సీజ్ చేశారు. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి సన్నిహితుడు రఘునాథ్ రెడ్డి నివాసంలోనూ రూ.2 కోట్లు సీజ్ చేశారు.

Malla Reddy IT Raids : కట్టల కట్టల డబ్బు.. మంత్రి మల్లారెడ్డి బంధువులు, సన్నిహితుల ఇళ్లలో కోట్ల రూపాయల నగదు సీజ్

Malla Reddy IT Raids : కొన్ని రోజులుగా టీఆర్ఎస్ నేతలపై ఈడీ, ఐటీ దాడులు, విచారణలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ వరుస దాడులతో టీఆర్ఎస్ నేతల్లో అలజడి మొదలైంది. తాజాగా మంత్రి మల్లారెడ్డి, ఆయన ఇద్దరు కుమారులు, కూతురు, అల్లుడు, వియ్యంకుడు, బంధువులు, సన్నిహితులు ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు కలకలం రేపాయి. దాదాపు 50 బృందాలు తెల్లవారుజాము నుంచి ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు.

మంత్రి మల్లారెడ్డి సమీప బంధవు ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు సీజ్ చేశారు అధికారులు. మల్లారెడ్డి బంధువు త్రిశూల్ రెడ్డి నివాసంలో దాడులు చేపట్టిన ఐటీ అధికారులు రూ.2 కోట్ల నగదు సీజ్ చేశారు. సుచిత్ర ప్రాంతంలో నివాసం ఉంటున్న త్రిశూల్ రెడ్డి ఇంట్లో ఈ ఉదయం నుంచే సోదాలు చేపట్టారు. మల్లారెడ్డి బాటలోనే త్రిశూల్ రెడ్డి కూడా పలు కాలేజీలు నడుపుతున్నారు.

ఇక మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి సన్నిహితుడు రఘునాథ్ రెడ్డి నివాసంలోనూ రూ.2 కోట్లు సీజ్ చేశారు. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలు, సికింద్రాబాద్ లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలోనూ ఐటీ బృందాలు సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి టార్గెట్ గా హైదరాబాద్ లో ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. మంత్రి నివాసం, కార్యాలయాలతో పాటు.. ఆయన కుమారులు, అల్లుడు, బంధువులు, సన్నిహితుల నివాసాలు, ఆఫీసుల్లోనూ సోదాలు చేపట్టాయి ఐటీ టీమ్స్. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి.. కుమారులు మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి నివాసాల్లో ఐటీ సోదాలు కంటిన్యూ అవుతున్నాయి.

మల్లారెడ్డి సోదరుడు గోపాల్ రెడ్డి, వియ్యంకుడు లక్ష్మారెడ్డి ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు ఐటీ అధికారులు. అటు మల్లారెడ్డి సమీప బంధువు త్రిశూల్ రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించిన ఐటీ బృందాలు.. రూ.2 కోట్ల నగదు సీజ్ చేశాయి. మరోవైపు మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి సన్నిహితుడు రఘునాథ రెడ్డి ఇంట్లో సోదాలు చేసిన ఐటీ టీమ్స్.. అక్కడా రూ.2 కోట్ల నగదు సీజ్ చేశాయి. అటు మల్లారెడ్డికి అల్లుడు వరుసయ్యే సంతోష్ రెడ్డి ఇంటికి వెళ్లారు ఐటీ అధికారులు. కాలేజీల ఆర్థిక లావాదేవీలపై ఐటీ టీమ్స్ వివరాలు సేకరిస్తున్నాయి.