CI Nageswara Rao : ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న సీఐ నాగేశ్వరరావు అక్రమాలు

హస్తిపురానికి చెందిన ఓ వివాహితపై నాగేశ్వరరావు అత్యాచారం చేసినట్లు మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరరావుపై ఆరోపణలు వచ్చాయి. ఆమెను, ఆమె భర్తను తుపాకీతో బెదిరించారని.. వాళ్లను కిడ్నాప్‌ చేశారని నాగేశ్వర్‌రావుపై ఆరోపణలు వచ్చాయి. దీంతో.. నాగేశ్వరరావు రెండ్రోజులుగా అజ్ఞాతంలోనే ఉన్నారు.

CI Nageswara Rao : ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న సీఐ నాగేశ్వరరావు అక్రమాలు

Nageshwar Rao

CI Nageswara Rao : మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావు అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఓ వివాహితపై అత్యాచారం కేసులో అజ్ఞాతంలో ఉన్న ఈ ఖాకీ అధికారిపై.. గతంలో హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతర్‌ చేసినట్లు ఆరోపణలున్నాయి. ఓ కేసులో సీజ్‌ చేసిన BMW కారును.. టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో సీఐ నాగేశ్వరరావు తన కస్టడీలో పెట్టుకున్నాడు. బాధితుడు ఎంత ప్రయత్నించినా కారు ఇవ్వని నాగేశ్వరరావు.. అతన్ని ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది.

హస్తిపురానికి చెందిన ఓ వివాహితపై నాగేశ్వరరావు అత్యాచారం చేసినట్లు మారేడ్‌పల్లి సీఐ నాగేశ్వరరావుపై ఆరోపణలు వచ్చాయి. ఆమెను, ఆమె భర్తను తుపాకీతో బెదిరించారని.. వాళ్లను కిడ్నాప్‌ చేశారని నాగేశ్వర్‌రావుపై ఆరోపణలు వచ్చాయి. దీంతో.. నాగేశ్వరరావు రెండ్రోజులుగా అజ్ఞాతంలోనే ఉన్నారు. బాధిత దంపతుల ఫిర్యాదుతో నాగేశ్వర్‌రావుపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. అత్యాచారం, కిడ్నాప్‌, ఆర్మ్స్‌ యాక్ట్‌ కింద కేసులు పెట్టారు.

Hyderabad : పరారీలో సీఐ నాగేశ్వరరావు-గాలిస్తున్న పోలీసులు

నాగేశ్వర్‌రావు కారులో.. బాధిత దంపతుల్ని కిడ్నాప్‌ చేసి తీసుకెళ్తుండగా ఇబ్రహీంపట్నం చెరువుకట్ట దగ్గర ప్రమాదం జరిగింది. అప్పుడు బాధితులు తప్పించుకుని వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. దాంతో ఆ ప్రాంతంలోని సీసీ ఫుటేజ్‌ను కూడా పోలీసులు సేకరించారు. ఆరోజు ఏం జరిగిందో తేల్చే పనిలో పడ్డారు. అంతేకాకుండా హస్తినాపురంలోని బాధితుల ఇంటికి ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వర్‌రావు వెళ్లినట్లు సీసీ ఫుటేజ్‌ ఆధారంగా తేల్చారు. ఆయన్ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.