Krishnam Raju: కృష్ణంరాజు మృతిపై మోదీ సంతాపం..

కృష్ణంరాజు మృతిపై ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. మరోవైపు కృష్ణంరాజు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయి.

Krishnam Raju: కృష్ణంరాజు మృతిపై మోదీ సంతాపం..

Krishnam Raju: సినీ నటుడు కృష్ణంరాజు మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. కృష్ణంరాజు మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని, సినీ రంగంలో ఆయన చేసిన సేవలు భావి తరాలు గుర్తుంచుకుంటాయని మోదీ పేర్కొన్నారు.

Krishnam Raju: కృష్ణంరాజు మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సహా పలువురి సంతాపం

మరోవైపు కృష్ణంరాజు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణంరాజు కేంద్ర మాజీ మంత్రి మాత్రమే కాదని.. తనకు ఎంతో ఆప్త మిత్రుడని కేసీఆర్ అన్నారు. ఆయన ఆదేశాలతో కృష్ణంరాజు అంత్యక్రియల్ని అధికారికంగా నిర్వహించేందుకు తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ ఏర్పాట్లు చేస్తున్నారు. కొద్దిసేపట్లో కృష్ణంరాజు పార్థివదేహం ఆస్పత్రి నుంచి ఆయన నివాసానికి చేరుకోనుంది. అక్కడ అభిమానులు, సన్నిహితుల సందర్శన కోసం తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.

Krishnam Raju: కృష్ణంరాజు మృతికి కారణాన్ని వెల్లడించిన ఆస్పత్రి వర్గాలు..

సోమవారం మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయి. కృష్ణంరాజు మృతిపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీడీపీ నేత నారా లోకేష్, సీపీఐ నేత నారాయణ సహా ప్రముఖులు సంతాపం ప్రకటించారు.