Harish Rao: పోలవరం ప్రాజెక్టు మరో ఐదేళ్లైనా పూర్తి కాదు.. కాళేశ్వరంపై ప్రతిపక్షాలది అసత్య ప్రచారం: హరీష్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. అలాగే ఏపీలోని పోలవరం ప్రాజెక్టు మరో ఐదేళ్లైనా పూర్తి కాదని అభిప్రాయపడ్డారు.

Harish Rao: పోలవరం ప్రాజెక్టు మరో ఐదేళ్లైనా పూర్తి కాదు.. కాళేశ్వరంపై ప్రతిపక్షాలది అసత్య ప్రచారం: హరీష్ రావు

Harish Rao: ఆంధ్ర ప్రదేశ్‌లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు మరో ఐదేళ్లైనా పూర్తి కాదని అభిప్రాయపడ్డారు తెలంగాణ మంత్రి హరీష్ రావు. సిద్ధిపేట జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అసత్యాలు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.

Pawan Kalyan: ఓట్లు రాకపోయినా నామినేషన్లు వేస్తాం.. యువత చెడిపోతుందనే ఒక్క యాడ్ కూడా చేయలేదు: పవన్ కల్యాణ్

‘‘పోలవరం పనులపై అక్కడి ఇంజినీర్లతో మాట్లాడా. మరో ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు పూర్తైతే గొప్పేనని ఇంజినీర్లు చెప్పారు. కాళేశ్వరం కంటే ముందే పోలవరం పనులు ప్రారంభమయ్యాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తై, ఆ ఫలాల్ని తెలంగాణ ప్రజలు పొందుతున్నారు. కానీ, కేంద్రం చేపట్టిన జాతీయ ప్రాజెక్టు పోలవరం మాత్రం ఇంకా పూర్తి కాలేదు. ఆ ఫలితం ప్రజలకు అందడం లేదు. కాళేశ్వరం గురించి ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి. ఒకే అబద్ధాన్ని పదేపదే చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఫలాల్ని అందుకుంటున్న మనం ఆ అబద్ధాలను తిప్పికొట్టాలి.

కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని చాటి చెప్పాలి. ప్రతిపక్షాలు ఢిల్లీలో, హైదరాబాద్‌లో కూర్చుని మాట్లాడితే ఏం తెలుస్తుంది. గ్రామాల్లోకి వెళ్లి చూస్తే కాళేశ్వరం ఫలాలు గ్రామాల్లో కనిపిస్తాయి’’ అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.