Telangana Corona News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.
Telangana Corona News : తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 40వేల 451 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 652 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 220 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 46 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 41 కేసులు, కరీంనగర్ జిల్లాలో 33 కేసులు, మంచిర్యాల జిల్లాలో 27 కేసులు గుర్తించారు.
అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 851 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే మరో అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 25వేల 360 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 15వేల 030 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 6వేల 219గా ఉంది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 40వేల 663 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 984 మందికి పాజిటివ్ గా తేలింది.
కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలంది. అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించింది. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
తెలంగాణ కరోనా బులెటిన్..
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.06.08.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/cHk0k2vFz8— IPRDepartment (@IPRTelangana) August 6, 2022