Telangana Govt : డీఎడ్ అభ్యర్థులకే ఎస్జీటీ పోస్టులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

బీఈడీ అర్హత ఉన్న అభ్యర్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్ (ఎస్ ఏ) పోస్టులకు మాత్రమే పోటీ పడాల్సి ఉంటుంది. ఎస్టీటీ పోస్టులకు బీఈడీ వారికి కూడా అర్హత కల్పిస్తూ 2018లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిర్ణయం తీసుకుంది.

Telangana Govt : డీఎడ్ అభ్యర్థులకే ఎస్జీటీ పోస్టులు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

Telangana Government (1) (1)

Telangana Govt Key Decision : టీచర్ పోస్టుల భర్తీ విషయమై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్టీటీ) ఉద్యోగాలను డిప్లోమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) అభ్యర్థులతోనే భర్తీ చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లోనే జీవో విడుదల చేస్తామని విద్యాశాఖ ఉన్నతాధికారి వెల్లడించారు. దీంతో బీఈడీ అర్హత ఉన్న అభ్యర్థులు కేవలం స్కూల్ అసిస్టెంట్ (ఎస్ ఏ) పోస్టులకు మాత్రమే పోటీ పడాల్సి ఉంటుంది. ఎస్టీటీ పోస్టులకు బీఈడీ వారికి కూడా అర్హత కల్పిస్తూ 2018లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిర్ణయం తీసుకుంది.

అయితే ఇటీవలే రాజస్థాన్ టీచర్ నియామకాలపై సుప్రీంకోర్టులో కేసు వేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ప్రాథమిక పాఠశాలల్లోని టీచర్ పోస్టులను డీఎడ్ అర్హత ఉన్న వారితోనే భర్తీ చేయాలని తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు కాపీని ఎన్సీటీఈ తన వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసింది. సుప్రీంకోర్టు తీర్పు దేశమంతటా అమలు కానుంది. తెలంగాణలో 6,612 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

TRT Notification : టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల.. 5,089 టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

వీటిలో 2,575 సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్టీటీ) పోస్టులే ఉన్నాయి. వాస్తవానికి ఎస్టీటీ పోస్టులను డీఎడ్ వారితో భర్తీ చేసే నిబంధన గతంలో అమలైంది. తర్వాత ఈ నిబంధనను సవరించి బీఈడీ వారికి అవకాశం కల్పిస్తూ 2018లో ఎన్సీటీఈ గెజిట్ ను జారీ చేసింది. అప్పటి నుంచి రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టలేదు. దీంతో బీఈడీ వారు ఎస్టీటీ పోస్టులకు అర్హత సాధించలేకపోయారు.

ఎన్సీటీఈ గెజిట్ ఆధారంగా ప్రాథమిక పాఠశాలల టీచర్ పోస్టులకు బీఈడీ వారు పోటీ పడే అవకాశమిస్తూ బీహార్ లో నోటిఫికేషన్ జారీ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ నోటిఫికేషన్ వెలువరించారు. ఆయా నోటిఫికేషన్ చెల్లదని తాజాగా ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎస్టీటీ పోస్టులను డీఎడ్ వారితోనే భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.