Telangana Govt : టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం చర్యలు.. కమిషన్ సభ్యులను మార్చాలని యోచన!
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఇష్యూతో తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. కమిషన్ సభ్యులను మార్చాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Telangana Govt : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఇష్యూతో తెలంగాణ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. కమిషన్ సభ్యులను మార్చాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మరిన్ని పరీక్షలను రద్దు చేసే యోచనలో టీఎస్పీఎస్సీ ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే గ్రూప్-1, ఏఈఈ, డీఏఈ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన టీఎస్పీఎస్సీ మరిన్ని పరీక్షలు రద్దు చేసే దిశగా ఆలోచించే దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
గ్రౌంట్ వాటర్, ఎమ్ వీఐ, జూనియర్ లెక్షరర్ పేపర్లు లీక్ అయినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. టౌన్ ప్లానింగ్, వెటర్నరీ అసిస్టెంట్ పరీక్షలు కాకపోవడంతో ఇబ్బంది లేదని టీఎస్పీఎస్సీ అంటోంది. పేపర్ లీక్ కేసుపై టీఎస్పీఎస్సీకి ఇచ్చిన సిట్ నివేదికలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పేపర్ లీక్లో కీలక సూత్రదారి రాజశేఖరే అని సిట్ తేల్చింది. ఉద్దేశపూర్వకంగానే టీఎస్పీఎస్సీకి డిప్యుటేషన్పై రాజశేఖర్ వచ్చారని తెలిపింది. టెక్నికల్ సర్వీస్ నుంచి రాజశేఖర్ డిప్యూటేషన్పై వచ్చారని పేర్కొంది.
TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక అంశాలు
ప్రవీణ్తో రాజశేఖర్ సంబంధాలు కొనసాగించారని చెప్పింది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా రాజశేఖర్ పనిచేస్తున్నారని వెల్లడించింది. రాజశేఖర్ కంప్యూటర్ని హ్యాక్ చేసి పాస్వర్డ్ని దొంగిలించారని సిట్ అధికారులు పేర్కొన్నారు. పాస్వర్డ్ని తాను ఎక్కడా రాయలేదని శంకర్ లక్ష్మి చెబుతున్నారని తెలిపారు. శంకర్ లక్ష్మి చెప్పిన దాంతో కంప్యూటర్ హ్యాక్ చేసినట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. రాజశేఖర్ పెన్డ్రైవ్ ద్వారా 5 పరీక్షా పత్రాలను కాపీ చేశారని వెల్లడించారు.
కాపీ చేసిన పెన్డ్రైవ్ను ప్రవీణ్కు రాజశేఖర్ ఇచ్చారని తెలిపారు.ఏఈ పరీక్ష పత్రాన్ని రేణుకకు ప్రవీణ్ అమ్మినట్లు చెప్పారు. ఫిబ్రవరి27నే పేపర్ను రాజశేఖర్ కాపీ చేశారని తెలిపారు. గ్రూప్-1 పరీక్షాపత్రం లీకైనట్లు సిట్ గుర్తించింది. ప్రవీణ్కు 103 మార్కులు రావడంపై సిట్ విచారణ జరిపింది. సెక్రటరీ దగ్గర పీఏగా చేస్తూ గ్రూప్-1 పరీక్షా పత్రాన్ని కొట్టేసినట్లు సిట్ నిర్ధారణ చేసింది.
మరోవైపు పేపర్ లీకేజీ కేసులో నిందితుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. 9 మంది నిందితులకు ఆరు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. రేపటి నుంచి మార్చి23 వరకు నిందితులకు పోలీస్ కస్టడీ విధించింది. నిందితులను పది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయగా ఆరు రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. దీంతో రేపు ఉదయం చర్లపల్లి జైలు నుంచి నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.