Telangana Covid Bulletin Report : తెలంగాణలో తగ్గిన కరోనా.. కొత్తగా ఎన్ని కేసులంటే
రాష్ట్రంలో ఇప్పటివరకు 7లక్షల 92వేల 871 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా... 7లక్షల 88వేల 363 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 397 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Telangana Covid Bulletin Report : తెలంగాణలో కరోనా రోజువారీ కేసులో కనిష్ఠ స్థాయిలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 8,260 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 29 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాద్ లో 24 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 3, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 1, ఆదిలాబాద్ జిల్లాలో 1 కేసు వచ్చాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 39 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. తాజాగా కరోనా మరణాలేవీ సంభవించలేదు.
రాష్ట్రంలో ఇంకా 397 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో నేటివరకు కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111. రాష్ట్రంలో ఇప్పటివరకు 7లక్షల 92వేల 871 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా… 7లక్షల 88వేల 363 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది.
Monkeypox : ఇజ్రాయెల్లో మొదటి మంకీపాక్స్ కేసు.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త..!
అటు దేశంలో కరోనా వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తోంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు 2వేల 500లోపే నమోదవుతుండటం ఊరట కలిగిస్తోంది. మరోవైపు యాక్టివ్ కేసులు కూడా 15 వేల దిగువనే కొనసాగుతున్నాయి. నిన్న 4లక్షల 42వేల 681కి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2వేల 226 మందికి పాజిటివ్ గా తేలింది.
అదే సమయంలో గడిచిన 24 గంటల్లో కరోనాతో మరో 65 మంది చనిపోయారు. దీంతో దేశంలో ఇప్పటి వరకూ కొవిడ్ తో మృతి చెందిన వారి సంఖ్య 5లక్షల 24వేల 413కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో మరో 2వేల 202 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4.25 కోట్లు (98.75%) దాటింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 14వేల 955 (0.03%) కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 14,37,381 మంది టీకాలు తీసుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 192.28 కోట్లు దాటింది.
మరోవైపు కరోనా వ్యాప్తిని అదుపులోకి తెచ్చి.. కోట్లాది మంది ప్రాణాలను కాపాడుతున్న బృహత్తర టీకా పంపిణీ కార్యక్రమంలో భారత్ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉంది. 2021 జనవరి 16న వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించగా.. త్వరలోనే 200 కోట్ల డోసుల మైలురాయిని చేరుకోనుంది.
North Korea: నార్త్ కొరియాకు వ్యాక్సిన్ అందించేందుకు సిద్ధమన్న అమెరికా.. కిమ్ ఏమన్నాడంటే..
కాగా, ప్రతి లబ్ధిదారునికి వ్యాక్సిన్ అందించేలా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. ముఖ్యంగా వచ్చే రెండు నెలలు (జూన్, జులై) ‘హర్ ఘర్ దస్తక్ 2.0’ పేరుతో ఇంటింటికీ వెళ్లి టీకా పంపిణీ చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలని అన్ని రాష్ట్రాల వైద్యాధికారులకు స్పష్టం చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా వృద్ధాశ్రమాలు, స్కూళ్లు, కాలేజీలు, ఖైదీలు, ఇటుక బట్టీల వంటి ప్రాంతాల్లో పనిచేసేవారు, విద్యకు దూరమైన చిన్నారులకు వ్యాక్సిన్ అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని తెలిపింది. ముఖ్యంగా 12 నుంచి 14ఏళ్ల పిల్లలకు టీకా పంపిణీ తక్కువగా ఉండడం, మరోవైపు ఆ వయసువారికి కొవిడ్ ముప్పు అధికంగా ఉన్నందున వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.22.05.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/F5bAqgy8Bd— IPRDepartment (@IPRTelangana) May 22, 2022