Rajaiah VS kadiyam Srihari : రాజయ్య పిచ్చి వేషాలు .. చిల్లర మాటలు మానకపోతే బండారం అంతా బయటపెడతా : కడియం శ్రీహరి

రాజయ్య పిచ్చి వేషాలు .. చిల్లర మాటలు మానకపోతే బండారం అంతా బయటపెడతా అంటూ స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వార్నింగ్ ఇచ్చారు.

Rajaiah VS kadiyam Srihari : రాజయ్య పిచ్చి వేషాలు .. చిల్లర మాటలు మానకపోతే బండారం అంతా బయటపెడతా : కడియం శ్రీహరి

Tatikonda Rajaiah vs kadiyam Srihari

Tatikonda Rajaiah vs kadiyam Srihari : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు వ్యక్తిగత విమర్శలకు దారి తీసింది. ఇద్దరూ మాజీ మంత్రులే కావడం, ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వాళ్ల కావడంతో ఈ వివాదానికి ప్రధానకరణమైంది. వాళ్ల పంచాయితీ ఇప్పుడు రచ్చకెక్కింది. వారే తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ హయంలో కడియం శ్రీహరి మంత్రిగా ఉన్న సమయంలో 360 ఎన్ కౌంటర్లు జరిగాయి అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యచేసిన వ్యాఖ్యలపై అదే పార్టీకి చెందిన కడియం శ్రీహరి స్పందించారు. రాజయ్య చిల్లర వేషాలు, చిలిపిచేష్టలు మానకపోతే అతని బండారం అంతా బయటపెడతాను అంటూ తనదైశైలిలో థమ్కీ ఇచ్చారు కడియం. రాజయ్య అవినీతి చిట్టా నాదగ్గర ఉంది ఇకనైనా రాజయ్య పిచ్చి మాటలు మానకపోతే అదంతా బయటపెడతాను అంటూ హెచ్చిరించారు కడియం శ్రీహరి.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు వ్యక్తిగత విమర్శలకు దారి తీసింది. ఇద్దరూ మాజీ మంత్రులే కావడం, ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వాళ్ల కావడంతో ఈ వివాదానికి ప్రధానకారణమైంది. గతంలో ఇద్దరూ ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లే అయినప్పటికీ ఇప్పుడు మాత్రం ఇద్దరి మధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ప్రస్తుతం వీరిద్దరిలో ఒకరు ఎమ్మెల్యే మరొకరు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ ఇద్దరు గులాబీ నేతల్లో ఒకరు స్టేషన్‌ ఘనపూర్‌ గడ్డ గురించి కొట్లాడుకుంటున్నారు. ఇది నా అడ్డా అని ఒకరు అంటే ఇది నా గడ్డ అంటూ మరొకరు విరుచుకుపడుతున్నారు. అలా ఇద్దరు నా దమ్ము చూడు అంటే మరొకరు నా సత్తా చూడు అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు.గత కొద్దిరోజులుగా కడియం శ్రీహరి,తాటికొండ రాజయ్య మధ్య ఉన్న కోల్డ్ నడుస్తోంది. ఇప్పుడు అదికాస్తా డైలాగ్‌ వార్‌గా మారిపోయింది. ఈ ఇద్దరూ నేతల మధ్య రాజుకున్న అగ్గిని గులాబీ బాస్ ఎలా చల్లార్చుతారో వాళ్లను ఏ విధంగా సమన్వయ పరుస్తారో వేచి చూడాలి.

Also read : Telangana : కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన వ్యాఖ్యలు

స్టేషన్‌ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మాజీ మంత్రి కడియం శ్రీహరిపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నాయి. రాజయ్య, కడియం శ్రీహరి ఇద్దరూ అధికార టీఆర్ఎస్‌లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయినప్పటికి నియోజకవర్గంలో ఆధిపత్య పోరు విషయంలో ఇద్దరూ ఎవరికి వారే అన్నట్లుగా ఉంటున్నారు. తాజాగా తాటికొండ రాజయ్య చిల్పూరు మండలం చిన్న పెండ్యాలలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ కడియం శ్రీహరిని ఉద్దేశించి తీవ్ర ఆరోపణలు, సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి టీడీపీలో మంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో అత్యధిక ఎన్‌కౌంటర్‌లు జరిగింది స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గంలోనే అని కామెంట్ చేశారు. అంతే కాదు సుమారు 361మంది నక్సలైట్లను ఎన్‌కౌంటర్‌ పేరుతో చంపించిన వ్యక్తి కడియం శ్రీహరి అని వ్యాఖ్యానించడంపై హాట్‌ టాపిక్‌గా మారింది. అంతే కాదు నియోజకవర్గంలో ఏదైనా చేయాలంటే ఎమ్మెల్యే వల్లే సాధ్యమవుతుంది తప్ప ఎమ్మెల్సీ వల్ల ఏమి కాదని..స్టేషన్‌ఘనపూర్‌ నా అడ్డా అంటూ పౌరుషంగా చేసిన కామెంట్స్‌కి రియాక్షన్ వెంటనే వచ్చింది. రాజయ్య వ్యాఖ్యలకు అంతే ధీటుగా ప్రెస్‌మీట్ పెట్టి మరీ కౌంటర్ ఇచ్చారు కడియం శ్రీహరి.

స్వచ్ఛంద సంస్థలతో సర్వే చేయిస్తే స్టేషన్ ఘనపూర్ ఎవరి అడ్డానో తెలుస్తుంది అంటున్నారు కడియం. రాజయ్యలాగా నేను సవాళ్లు..సర్వేలు అంటూ పార్టీ నియమనిబంధనలు ఉల్లంఘించను అంటూ స్పష్టంచేశారు కడియం. రాజయ్య ఇప్పటికైనా హుందాగా ఉండాలని సూచించారు. లేకుండా ఆయనగారి చిలిపిచేష్టలు, చిల్లరవేషాలు..చేసిన అవినీతి చిట్టాలు నాదగ్గర ఉన్నాయని వాటిని బయటపెడతాను అంటూ హెచ్చరించారు.