Jean Editing BPT : జీన్ ఎడిటింగ్ బి.పి.టి 5204.. ఎకరాకు 60 బస్తాల దిగుబడి
సాధారణంగా బిపిటి 5204 వరి వంగడం పంట కాలం 150 రోజుల దాకా ఉండటంతో ఖరీఫ్ లోనే రైతులు పండించాల్సి వస్తోంది. ఏకంగా 5 నెలల పాటు పైరు సాగులో ఉండటంవలన కరవు, తుపాన్లు, అధిక వర్షాలు వంటి విపత్తులు వచ్చినప్పుడు రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. సమస్యను అధిగమించడానికి జీన్ ఎడిటింగ్తో సాగుకాలాన్ని 20 రోజుల దాకా తగ్గించారు శాస్త్రవేత్తలు.
Jean Editing BPT : రైతుసోదరులకు శుభవార్త. అతి తక్కువ కాలంలో.. అధిక దిగుబడినిచ్చే సన్నరకం జీనోమ్ ఎడిటెడ్ బిపిటి 5204 అందుబాటులోకి రానుంది. రాజేంద్రనగర్లోని భారత వరి పరిశోధన సంస్థ జీన్ ఎడిటింగ్ పరిజ్ఞానంతో క్రిస్ పర్ క్యాస్ అనే పద్ధతి ద్వారా ఈ నూతన సన్నరకాన్ని రూపొందించింది .ఈ రకం బిపిటి కంటే 35 శాతం దిగుబడి పెరగడమే కాకుండా.. పంట కాలం 20 రోజులు తగ్గుతోంది. మరో రెండేళ్లలో జెనోమి ఎడిటెడ్ బి.పి.టి – 5204 వరి రకం రైతులకు అందుబాటులోకి రానుంది.
READ ALSO : Pest Control In Paddy : ఎడగారు వరిలో పొట్టకుళ్లు పొడ తెగులు.. నివారణకు శాస్త్రవేత్తల సూచనలు
బాపట్ల వరి పరిశోధనా స్థానం విడుదలచేసిన సాంబామసూరి పేరుతో విడుదల చేసిన బిపిటి – ఏభై రెండు సున్నా నాలుగు ( 5204) రకం ఇప్పటికీ వరిలో రారాజుగా వెలుగొందుతోంది. దేశవ్యాప్తంగా ప్రసిద్ది పొందిన ఈ వరి రకం ధాన్యం నుంచి వచ్చే సన్నరకం బియ్యాన్నే మార్కెట్లలో వ్యాపారులు ‘సోనా మసూరి’ అని వివిధ ప్రాంతాల పేర్లను ముందు తగిలించి విక్రయిస్తున్నారు.
READ ALSO : Weed Control : వరి సాగులో కలుపు నివారణకు రైతులు చేపట్టాల్సిన చర్యలు!
కర్నూలు సోనా ఈ రకానికి చెందిన బియ్యమే. దీనిలోని ఇతర మంచి లక్షణాలు మారకుండా అధిక దిగుబడి పొందేందుకు జీన్ ఎడిటింగ్ పరిజ్ఞానంతో కొత్త వంగడాన్ని సృష్టించారు రాజేంద్రనగర్లోని భారత వరి పరిశోధన సంస్థ . సాధారణ వంగడంతో పండించిన పైరులో వరి మొక్కకు వచ్చే కంకిలో90 నుండి 150 వరకూ గింజలు ఉంటాయి. కానీ, జీన్ ఎడిటింగ్ వంగడంలో 350 నుంచి 400 వరకు గింజలు వచ్చాయి.
READ ALSO : Luffa Cultivation : బీరసాగుతో లాభల పంట
సాధారణంగా బిపిటి 5204 వరి వంగడం పంట కాలం 150 రోజుల దాకా ఉండటంతో ఖరీఫ్ లోనే రైతులు పండించాల్సి వస్తోంది. ఏకంగా 5 నెలల పాటు పైరు సాగులో ఉండటంవలన కరవు, తుపాన్లు, అధిక వర్షాలు వంటి విపత్తులు వచ్చినప్పుడు రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. సమస్యను అధిగమించడానికి జీన్ ఎడిటింగ్తో సాగుకాలాన్ని 20 రోజుల దాకా తగ్గించారు శాస్త్రవేత్తలు . ప్రస్తుతంబిపిటి 5204 వంగడంతో ఎకరానికి 35-40 బస్తాల దాకా రైతులు దిగుబడి తీస్తున్నారు. ఈ కొత్త వంగడంతో ఎకరానికి 55-60 బస్తాల దిగుబడి వస్తుందని పరిశోధనల్లో తేలింది.
READ ALSO : Black Rice : నల్ల బియ్యానికి పెరుగుతున్న డిమాండ్, కిలో రూ.200… నల్ల వరిసాగు వైపు రైతుల మొగ్గు
జీన్ ఎడిటింగ్తో వరిమొక్కలో మరో కొత్త మార్పూ వచ్చింది. వరిమొక్క కాండం సాధారణ వంగడాని కన్నా మరింత బలంగా పెరిగింది. ఇప్పటికే ప్రయోగశాలల్లో 3 సీజన్లలో పంట పండించి అధిక దిగుబడి సాధించారు. ప్రస్తుతం ఐఐఆర్ఆర్ క్షేత్రాల్లో నాలుగో సీజన్లో సాగుచేస్తున్నారు. దీని పరిశోధన వివరాలన్నీ భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్)కు పంపారు. ఆ తరువాత రెండేళ్లపాటు రైతుల క్షేత్రాల్లో మినికిట్ దశలో సాగుచేసి అనంతరం రైతులకు అందుబాటులోకి తీసుకరానున్నారు.