ఏపీలో కరోనా కేసులు: ఒకటి తక్కువ పదివేలు

Andhra Pradesh Coronavirus Update: ఏపీలో కరోనా వ్యాప్తికి అడ్డకట్టపడటంలేదు. పదివేలకు దగ్గర్లోనే ప్రతిరోజూ కొత్త కేసులు నమోదువుతున్నాయి. పరీక్షలు పెరుగుతున్నాయి, కరోనా కేసులూ పెరుగుతున్నాయని అంటోంది ప్రభుత్వం. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 71,137 శాంపిల్స్ పరీక్షిస్తే, 9,999 పాజిటీవ్ కేసులుగా తేలాయి. ఇదే సమయంలో 77 మంది చనిపోయాని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఆనందకరమైన విషయమేంటేంటే… 11,069 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. అంటే… కొత్త కేసులుకన్నా, డిశ్చార్జ్ అయినవాళ్లే ఎక్కువ.