AP Covid-19 Live Updates : ఏపీలో కొత్తగా 3,620 కరోనా కేసులు, 16 మరణాలు

  • Published By: sreehari ,Published On : October 22, 2020 / 06:20 PM IST
AP Covid-19 Live Updates : ఏపీలో కొత్తగా 3,620 కరోనా కేసులు, 16 మరణాలు

Updated On : October 22, 2020 / 6:20 PM IST

AP Covid-19 Live Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా రిలీఫ్ అవుతున్నారు.



రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 76,726 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో కొత్తగా 3,620 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 7,96,919లకు చేరాయి.



రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా భారీగా తగ్గిపోయాయి. కరోనా బారినపడి 16 మంది మరణించారు. గత 24 గంటల్లో 3,723 మంది కరోనాను పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.



రాష్ట్రంలో 7,58,138 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 73,47,776 మందికి శాంపిల్స్ పరీక్షించగా 32,257 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 6,524కు చేరుకుంది.



ఏపీలో పలు జిల్లాల్లో కోవిడ్ వల్ల గుంటూరులో నలుగురు, చిత్తూరులో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఇద్దరు, కృష్ణలో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, అనంతపూర్ లో ఒక్కరు, కడపలో ఒక్కరు, విశాఖపట్నంలో ఒక్కరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు మరణించారు.