AP Covid-19 Live Updates : ఏపీలో కొత్తగా 4,038 కరోనా కేసులు, 38 మరణాలు

AP Covid-19 Live Updates : కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా ఇప్పుడప్పుడే రిలీఫ్ అవుతున్నారు.
రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్లో గడిచిన 24 గంటల్లో 73,767 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో కొత్తగా 4,038 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 7,71,503లకు చేరాయి. రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా భారీగా తగ్గిపోయాయి.
కరోనా బారినపడి 38 మంది మరణించారు. 5,050 మంది కరోనాను పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో 7,25,099 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 68,46, 040 మందికి శాంపిల్స్ పరీక్షించగా 40,047 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 6,357కు చేరుకుంది. ఏపీలో పలు జిల్లాల్లో కోవిడ్ వల్ల చిత్తూరులో తొమ్మిది మంది, ప్రకాశంలో ఏడుగురు, కృష్ణలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, కడపలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, అనంతపూర్ లో ఒక్కరు, కర్నూల్ లో ఒక్కరు, విజయనగరంలో ఒక్కరు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు మరణించారు.