AP Covid-19 Live Updates : ఏపీలో కరోనా తగ్గుముఖం, 5,529 మంది రికవరీ

AP Covid-19 Live Updates : కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి. కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది.
ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా ఇప్పుడప్పుడే రిలీఫ్ అవుతున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్లో గడిచిన 24 గంటల్లో 70,881 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
వారిలో కొత్తగా 3,676 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 7,79,146లకు చేరాయి. రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా భారీగా తగ్గిపోయాయి. కరోనా బారినపడి 38 మంది మరణించారు.
5,050 మంది కరోనాను పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో 7,35,638 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 69,91,258 మందికి శాంపిల్స్ పరీక్షించగా 37, 102 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 6,406కు చేరుకుంది.
ఏపీలో పలు జిల్లాల్లో కోవిడ్ వల్ల చిత్తూరులో ఐదుగురు, గుంటూరులో నలుగురు, కృష్ణలో నలుగురు, విశాఖపట్నంలో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, తూర్పుగోదావరిలో ఇద్దరు, నెల్లూరులో ఒక్కరు, ప్రకాశంలో ఒక్కరు, శ్రీకాకుళంలో ఒక్కరు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు మరణించారు.