AP Covid-19 Live Updates : ఏపీలో 8 లక్షలు దాటిన కరోనా కేసులు

  • Published By: sreehari ,Published On : October 23, 2020 / 06:23 PM IST
AP Covid-19 Live Updates : ఏపీలో 8 లక్షలు దాటిన కరోనా కేసులు

Updated On : October 23, 2020 / 6:52 PM IST

AP Covid-19 Live Updates : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు 8 లక్షలు దాటేశాయి. కరోనా పాజిటివ్ కేసుల కంటే రికవరీ కేసులతో కోలుకునేవారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రజలంతా రిలీఫ్ అవుతున్నారు.



రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 80,238 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. వారిలో కొత్తగా 3,765 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 8,00,684లకు చేరాయి.



రాష్ట్రంలో కరోనా మరణాలు కూడా భారీగా తగ్గిపోయాయి. కరోనా బారినపడి 20 మంది మరణించారు. గత 24 గంటల్లో 3,723 మంది కరోనాను పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.



రాష్ట్రంలో 7,62,419 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 73,47,776 మందికి శాంపిల్స్ పరీక్షించగా 31,721 యాక్టివ్ కేసులు ఉన్నాయి.



కరోనా వల్ల మృతి చెందిన వారి సంఖ్య 6,544కు చేరుకుంది. ఏపీలో పలు జిల్లాల్లో కోవిడ్ వల్ల గుంటూరులో నలుగురు, కడపలో ముగ్గురు, కృష్ణలో ముగ్గురు, అనంతపూర్‌లో ఇద్దరు, చిత్తూరులో ఇద్దరు, తూర్పు గోదావరిలో ఇద్దరు, కర్నూల్‌లో ఒక్కరు, ప్రకాశంలో ఒక్కరు, విశాఖపట్నంలో ఒక్కరు, పశ్చిమ గోదావరిలో ఒక్కరు మరణించారు.