నెల్లూరు జిల్లా టీడీపీలో వర్గపోరు.. ఆనం సమక్షంలోనే కొట్టుకున్న తెలుగు తమ్ముళ్లు

కేశవ చౌదరి ఇంటికి వస్తానని చెప్పి రాకుండా ఆనం, మాజీ ఎమ్మెల్యే లక్ష్మయ్య నాయుడు నేరుగా రవీంద్ర నాయుడు ఇంటికి వెళ్లడంతో గొడవ మొదలైంది.

నెల్లూరు జిల్లా టీడీపీలో వర్గపోరు.. ఆనం సమక్షంలోనే కొట్టుకున్న తెలుగు తమ్ముళ్లు

Nellore TDP group fight: నెల్లూరు జిల్లా టీడీపీలో రాజకీయ విభేదాలు రచ్చకెక్కాయి. వర్గపోరుతో తెలుగు తమ్ముళ్లు కుమ్ములాటలకు దిగారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగులవెల్లటూరులో గురువారం రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణతో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలోనే కేశవ చౌదరి, రవీంద్ర నాయుడు వర్గాలు ఘర్షణకు దిగాయి. రవీంద్ర నాయుడు ఈరోజు టీడీపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో కేశవ చౌదరి ఇంటికి వస్తానని చెప్పి రాకుండా ఆనం, మాజీ ఎమ్మెల్యే లక్ష్మయ్య నాయుడు నేరుగా రవీంద్ర నాయుడు ఇంటికి వెళ్లడంతో గొడవ మొదలైంది. కేశవ చౌదరి వర్గీయులు.. రవీంద్ర నాయుడు ఇంటికే వెళ్లి ఘర్షణకు దిగారు.

Also Read: ప్రభుత్వం వచ్చాక వారిపై చర్యలు ఉంటాయి- విజయసాయిరెడ్డి వార్నింగ్

పరస్పరం భౌతిక దాడులు చేసుకోవడంతో పరిస్థితి సీరియస్ గా మారింది. ఒకదశలో ఆనం రామనారాయణ రెడ్డిని కూడా పక్కకు తోసేశారు. కొమ్మి లక్ష్మయ్య నాయుడుపైనా ఓ వర్గం దాడికి యత్నించింది. దీంతో టీడీపీ శ్రేణులపై సీరియస్ అయిన ఆనం రామనారాయణ రెడ్డి అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.