జైళ్లలోని మహిళా ఖైదీలు విడుదలకు రంగం సిద్ధం.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఐదు సంవత్సరాల పాటు జైలు జీవితం అనుభవించి పూర్తయిన మహిళా ఖైదీలను విడుదల చేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జీవిత ఖైదు అనుభవిస్తున్న మహిళలను విడుదల చేయనున్నట్టు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ విడుదల చేశారు.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి మహిళా జీవిత ఖైదీల విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి కసరత్తు చేసేందుకు ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి(హోంశాఖ), సభ్యులుగా ప్రభుత్వ కార్యదర్శి(లీగల్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ అండ్ జస్టిస్, లా డిపార్ట్మెంట్), డీజీపీ లేదా డీజీపీ నామినేట్ చేసిన పోలీస్ అధికారి, ఏపీ సీఐడీ చీఫ్ లీగల్ అడ్వైజర్, జిల్లా జడ్జి, ఇంటెలిజెన్స్ ఏడీజీ, జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ ఉంటారు.
https://10tv.in/police-ready-to-arrest-nagendra-in-divya-tejaswini-murder-case/
జైళ్లలో శిక్ష అనుభవిస్తోన్న మహిళలకు చెందిన సమాచారాన్ని సమీక్షించి మార్గదర్శకాలను అనుగుణంగా ఉన్నవారి జాబితా సిద్ధం చేసి కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా.. ఐదేళ్ల శిక్ష పూర్తి చేసుకుని, మార్గదర్శకాలకు అనుగుణంగా ఉన్నవారిని ప్రభుత్వం విడుదల చేసేందుకు చర్యలు తీసుకోనుంది.