“మీ ఏడుపులే మాకు దీవెనలు జగన్” అంటూ కౌంటర్ ఇస్తూ.. ఈసెట్ కౌన్సిలింగ్‌పై క్లారిటీ ఇచ్చేసిన నారా లోకేశ్

"మేము ప్రభుత్వంలోకి రాగానే ఈసెట్ మొదటి కౌన్సిలింగ్‌ని జూలై మూడో వారం కల్లా పూర్తి చేశాము" అని అన్నారు.

“మీ ఏడుపులే మాకు దీవెనలు జగన్” అంటూ కౌంటర్ ఇస్తూ.. ఈసెట్ కౌన్సిలింగ్‌పై క్లారిటీ ఇచ్చేసిన నారా లోకేశ్

Nara Lokesh

Updated On : June 29, 2025 / 7:35 PM IST

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యావ్యవస్థపై తీవ్ర విమర్శలు గుప్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు. “మీ ఏడుపులే మాకు దీవెనలు జగన్ మోహన్ రెడ్డి. మీరు ఐదేళ్లు విద్యా వ్యవస్థను అస్తవ్యస్తం చేసి పోయారు.

నేను ఏడాదిలోనే అనేక సంస్కరణలు తీసుకొచ్చి ప్రభుత్వ విద్యా వ్యవస్థను గాడిన పెట్టడం చూసి మీకు కడుపుమంట రావడం సహజం. మీ హయాంలో ఎప్పుడు కౌన్సిలింగ్ పెట్టారో కూడా మీకు స్పృహ లేదు. కొవిడ్ తరువాత మీరు 2022 సెప్టెంబర్‌లో, 2023 జూలై చివరికి ఈసెట్ కౌన్సిలింగ్ పూర్తి చేశారు.

ఇటువంటి మీరు మమ్మల్ని విమర్శించటం మీ అజ్ఞానానికి నిదర్శనం. మేము ప్రభుత్వంలోకి రాగానే ఈసెట్ మొదటి కౌన్సిలింగ్‌ని జూలై మూడో వారం కల్లా పూర్తి చేశాము. ఈ సంవత్సరం కూడా మొదటి కౌన్సిలింగ్‌ని జూలై మూడో వారానికి పూర్తి చేస్తాము” అని తెలిపారు.

కాగా, ఈసెట్‌ రిజల్ట్స్‌ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్‌ ప్రారంభం కాలేదని వైఎస్‌ జగన్ ఇవాళ ఎక్స్‌లో ఏపీ మంత్రి లోకేశ్‌ను విమర్శించారు. రేపటి నుంచి ఇంజినీరింగ్‌ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయని అన్నారు. అయినప్పటికీ, అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం, విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనమని చెప్పారు.