టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌కు గాయాలు

NMD Farooq: ఆయనను పాణ్యం అభ్యర్థి గౌరు చరిత, టీడీపీ కార్యకర్తలు కలిసి శాంతిరాం హాస్పిటల్ కు తరలించారు.

టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌కు గాయాలు

NMD Farooq

కర్నూలు జిల్లాలోని నంద్యాల టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌కు తృటిలో రోడ్డు ప్రమాదం తప్పింది. కర్నూలు వెళుతుండగా పాణ్యం సమీపంలోని తమ్ము రాజుపల్లె వద్ద ఫరూక్ కాన్వాయ్ ఒక్కసారిగా అదుపుతప్పి బర్రెలను ఢీకొట్టింది. కారులో బెలూన్స్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది.

ఆయనను పాణ్యం అభ్యర్థి గౌరు చరిత, టీడీపీ కార్యకర్తలు కలిసి శాంతిరాం హాస్పిటల్ కు తరలించారు. ఆయన పెను ప్రమాదం నుంచి బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఏపీలో ఎన్నికల వేళ ఎన్ఎండీ ఫరూక్‌ ప్రచార కార్యక్రమాల్లో తీరకలేకుండా పాల్గొంటున్నారు.

అభ్యర్థిగా తన పేరు ఖరారైనప్పటి నుంచి నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ఏపీ మాజీ ఏపీపీఎస్సీ ఇన్‌చార్జి చైర్మన్, ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ డాక్టర్ నౌమాన్ ను ఎన్ఎండీ ఫరూక్ సోమవారం కలిశారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తమకు మద్దతు ఇవ్వాలని నౌమన్ కు కోరారు.

ఎన్నికల్లో ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌పై ట్రాన్స్‌జెండ‌ర్ త‌మ‌న్నా సింహాద్రి పోటీ.. ఏ పార్టీ నుంచో తెలుసా?