చంద్రబాబు చేయలేనిది నేను చేశా, ఇప్పుడేమంటారు బాబాయ్

పూసపాటి వంశంలో మూడవ తరం నుంచి ఆనందగజపతిరాజు పెద్ద కూతురు సంచయిత గజపతిరాజు సింహాచలం దేవస్థానం బోర్డు చైర్ పర్సన్ గా నియమితులు కావడం వివాదం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ఆమె బాబాయ్ అశోక్ గజపతి రాజు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆమె ఆ పదవికి పనికి రాదు, అనర్హురాలు అన్నారు. ఇప్పుడు అదే అమ్మాయి ఘన విజయం సాధించింది. రూ.53 కోట్ల కేంద్ర నిధులను తీసుకొచ్చింది. ఆ నిధులతో సింహాచలాన్ని ప్రపంచ నెంబర్ వన్ టెంపుల్ గా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
అంతే కాదు, ఆమె చైర్ పర్సన్ గా బాధ్యత తీసుకున్న తర్వాత చేసిన కృషికి, ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కూడా కురిపించింది. ఈ నేపధ్యంలో ఇప్పుడేమంటారు బాబాయ్ అంటోంది సంచయిత. ఎవరో ఒక అమ్మాయిని తెచ్చి సీట్లో కూర్చోబెట్టారని ఇంతకాలం ఆడిపోసుకున్న వారు ఇకనైనా మౌనాన్ని ఆశ్రయిస్తారనుకుంటాను అంటూ ట్వీట్ చేశారు సంచయిత.