8 పెళ్లిళ్లు చేసుకున్న కేటుగాడు : భార్యల్ని వ్యభిచారం చేయమంటూ కత్తులు,తుపాకులతో హింసలు

Vishakha Young Man With Eight Marriages
Vishakha Young man with eight marriages : ఏపీలోని విశాఖపట్నంలో నిత్య పెళ్లి కొడుకు అరాచకాలు వెలుగులోకి వచ్చాయి. అరుణ్ కుమార్ అనే వ్యక్తి ఒకటీ కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్నాడు. అక్కడితో అతని అరాచకాలు ఆగలేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యల్ని వ్యభిచారం చేయమంటూ ప్రతీరోజు వేధిస్తున్నాడు. కాదని అంటే హింసలకకు పాల్పడుతున్నాడు.
అరుణ్ కుమార్ కు గంజాయి, వ్యభిచారం చేసే ముఠాలతో సంబంధాలున్నాయి. దీంతో డబ్బు సంపాదన కోసం ఏకంగా ఎనిమిది పెళ్లిళ్లు చేసుకోవటమే కాకుండా వారిని వ్యభిచారం చేయాలని వేధిస్తున్నాడు. భార్యలతో నే కాకుండా అరుణ్ కుమార్ మొదటి భార్యకు పుట్టిన అమ్మాయిని కూడా వ్యభిచారం చేయాలని వేధిస్తున్నాడు. తను చెప్పిన మాట వినకపోతే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. కేవలం బెదిరింపులే కాకుండా కత్తులు, తుపాకిలకు చూపెట్టి నేను చెప్పినట్లు వినకపోతే చంపిపారేస్తానంటూ వేధించాడు. దీంతో అరుణ్ కుమార్ మొదటిభార్య కంచరపాలెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తమ గోడు చెప్పుకుంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అరుణ్ కుమార్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అతనికి గంజాయి, వ్యభిచారం చేసే ముఠాలతో సంబంధాలున్నగా గుర్తించారు.
అరుణ్ కుమార్ అరాచాలకు తెలుసుకున్న మిగిలిన భార్యలు కూడా మహిళా సంఘాలను ఆశ్రయించారు. తమకు న్యాయంచేయమని..అరుణ్ కుమార్ అరాచకాల నుంచి తమను రక్షించమని వేడుకున్నారు. కాగా..అరుణ్ కుమార్ వల్ల మోసపోయిన భార్యలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదనీ..పోలీసులకు అరుణ్ కుమార్ కు సంబంధాలున్నాయని అందుకే అరుణ్ కుమార్ పై చర్యలు తీసుకోవటం లేదని మహిళా సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పోలీసులు పట్టించుకోకపోవటం వల్లే బాధిత మహిళలు సీపీకి వాయిస్ మెసేజ్ పెట్టారని మహిళాసంఘం నేతలు తెలిపారు.
సీపీ గారికి బాధిత మహిళలు వాయిస్ మెసేజ్ పెట్టటంతో సీపీ స్థానిక పోలీసులకు వెంటనే ఫోన్ చేసిన బాధిత మహిళల విషయాన్ని వెంటనే తేల్చాలని చెప్పటంతో..స్థానికపోలీసులు అరుణ్ కుమార్ కు ఫోన్ చేసి మీ భార్యలు సీపీకి వాయిస్ మెసేజ్..కొన్ని ఫోటోలు పంపించారని నీ భార్యల సంగతి నువ్వు చూసుకోవాలని సమాచారం ఇచ్చారని దీంతో అరుణ్ కుమార్ భార్యలకు చంపేస్తానంటూ కత్తి పట్టుకుని తిరుగుతున్నాడనీ దీంతో ప్రాణాలు దక్కించుకోవటానికి అతని భార్యలు ఇంటినుంచి పారిపోయి ఓ గుడిలో దాక్కుని ఎవరో చెప్పిన సమాచారంతో మమ్మల్ని ఆశ్రయించారని మహిళాసంఘం నేతల తెలిపారు. వెంటనే అరుణ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని మహిళాసంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు.