కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకేతో వైఎస్ షర్మిల భేటీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిశారు.

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకేతో వైఎస్ షర్మిల భేటీ

YS Sharmila meets Siddaramaiah Dk Shiva Kumar in Bengaluru

YS Sharmila in Bengaluru: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. బెంగళూరులో వారి నివాసాలకు వెళ్లి భేటీ అయ్యారు. ఏపీలో పార్టీ బలోపేతంపై చర్చించినట్టు సోషల్ మీడియా ద్వారా షర్మిల వెల్లడించారు.

ఈ నెల 8వ తేదీన విజయవాడలో జరగనున్న దివగంత నేత డాక్టర్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలకు వారిని సాదరంగా ఆహ్వానించినట్టు తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కను కలిసిన షర్మిల.. వారిని కూడా తన తండ్రి జయంతి వేడుకలకు ఆహ్వానించారు.

కాగా, దివగంత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలను విజయవాడ తాడేపల్లిలోని CK కన్వెన్షన్ సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 8న నిర్వహించనున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్య నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఇతర AICC పెద్దలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు.

Also Read : పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పొద్దు.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కామెంట్స్